శ్రీశైల పుణ్యక్షేత్రంలో పరివార మూర్తులకు లోక కళ్యాణ సేవలు
శెనగల బసవన్నకు విశేష పూజలు లోక కల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం మంగళవారం ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర స్వామికి (శెనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలను నిర్వహించనుంది. ప్రతి మంగళవారం, త్రయోదశి రోజున దేవస్థాన సేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది. ప్రదోషకాలంలో అనగా సాయంసంధ్యాసమయంలో ఈ విశేషపూజలు నిర్వహించడం జరుగుతోంది. ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని చెప్పడం జరుగుతుంది. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను జరిపించబడుతుంది. ఆ తరువాత నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ, ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం , మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహిస్తారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం నిర్వహించబడుతుంది. వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని చేయడం జరుగుతుంది. తరువాత నందీశ్వరస్వామివారికి నూతనవస్త్ర సమర్పణ, విశేషపుష్పార్చనలను చేస్తారు. అనంతరం నానబెట్టిన శెనగలను నందీశ్వరస్వామికి సమర్పించడం జరుగుతుంది. కల్యాణం కోసం మంగళవారం , కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఉదయం ఆలయప్రాంగణంలోని శ్రీసుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష పూజలను నిర్వహించడం జరిగింది. కృత్తికానక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం , పూజాదికాలు దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) జరిపించారు. కుమారస్వామివారికి పూజలు జరపడం వలన లోకకల్యాణమే కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగి ఆయా పనులు సక్రమంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో శత్రుబాధలు, గ్రహపీడలు, దృష్టి దోషాలు మొదలైనవి తొలగిపోతాయి. అలాగే సంతానం కోసం పూజించేవారికి తప్పక సంతానభాగ్యం లభిస్తుందని చెప్పబడుతోంది. ఈ అభిషేకానికి ముందుగా దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. లోకకల్యాణం కోసం దేవస్థానం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీ బయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను జరిపించనున్నది. ప్రతీ మంగళవారం , అమావాస్య రోజులలో బయలువీరభద్ర స్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహించబడుతున్నాయి. బయలు వీరభద్రస్వామివారు శివభక్తగణాలకు అధిపతి. అదేవిధంగా శ్రీశైలక్షేత్రపాలకుడుగా క్షేత్రానికి ఆరుబయట ఉండి, ఎటువంటి ఆచ్చాదన, ఆలయం లేకుండగా బయలుగా దర్శనమిస్తాడు కనుక ఆయనకు బయలువీరభద్రస్వామి అని పేరు వచ్చింది. ప్రసన్నవదనంతో కిరీట మకుటాన్ని కలిగి దశభుజుడైన స్వామివారు పది చేతులలో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తాడు. స్వామివారికి క్రింది వైపున కుడివైపు దక్షుడు, ఎడమవైపు భద్రకాళి దర్శనమిస్తారు. ఈ స్వామిని దర్శించినంత మాత్రానే ఎంతటి క్లిష్ట సమస్యలైనా తొలగిపోతాయని, వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని ప్రసిద్ధి. ముఖ్యంగా ఆగమసంప్రదాయంలో క్షేత్రపాలక పూజకు చాలా విశేషస్థానం ఉంది. క్షేత్ర పాలకుడికి పూజలు చేయడం వలన ఆ క్షేత్రంలో ఉన్నటువంటి భక్తులు ఎటువంటి భయం, ఈ స్వామిపూజతో సకలగ్రహ అరిష్టదోషాలు, దుష్టగ్రహ పీడలు తొలగిపోతాయి. అదేవిధంగా సంతానం, ఐశ్వర్యం మొదలైన అనేక శుభఫలితాలు చేకూరుతాయి. ఈ పూజాదికాలలో పంచామృతాలు తోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది.
2025-04-30T09:01:30Z
ఉదయం ఆకుపచ్చగా, మధ్యాహ్నం నల్లగా, సాయంత్రం నీలంగా, రాత్రి తెల్లగా కనిపించే వస్తువు ఏది?
ఇప్పటి తరంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలన్న ఆశ కలగడం సహజం. కానీ ఆ ఆశను నిజం చేసేందుకు పోటీ పరీక్షల అనేవి పెద్ద మెట్టు. రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఎన్నో ఉద్యోగాల కోసం నిర్వహించే ఈ పరీక్షల్లో లక్షలాది మంది పోటీ పడుతున్నారు. ఈ పోటీకి టఫ్ గానే ఉంటుంది. అందులోనూ విజయం సాధించాలంటే కేవలం పాఠ్యాంశాల మీదే కాకుండా సాధారణ జ్ఞానం (General Knowledge – GK) మీద కూడా పట్టు తప్పనిసరి. సాధారణ జ్ఞానం అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలిసే విషయాలు. ఇవి పుస్తకాలకే పరిమితంగా ఉండవు. నిత్యం వార్తల్లో, చరిత్రలో, భూగోళ శాస్త్రంలో, రాజకీయాలలో, ప్రకృతిలో – ఇలా అన్ని రంగాల్లోనూ మనం పొందే సమాచారం దీనిలోకి వస్తుంది. ఇది మన ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుంది. ప్రశ్న అడిగినప్పుడు కేవలం మెమరీ కాకుండా లాజిక్ ఆధారంగా సమాధానం చెప్పగలిగే శక్తిని ఇస్తుంది. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్ ఒక కీలక భాగంగా ఉంటుంది. గ్రూప్ పరీక్షలు, పోలీస్, బ్యాంక్, SSC, UPSC, RRB వంటి అన్ని పరీక్షల్లోనూ GKని ప్రాధాన్యతతో ప్రశ్నిస్తారు. ఒక్కోసారి దీనిపైనా ఉత్తీర్ణత ఆధారపడే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ అంశంపై రోజూ కాస్త సమయం కేటాయించడం అవసరం. జనరల్ నాలెడ్జ్ అనేది కేవలం ముక్కుసూటిగా ప్రశ్న – సమాధానం కాదు. కొన్నిసార్లు ప్రశ్నలు సరదాగా, క్రియేటివ్గా ఉంటాయి. ఉదాహరణకు: "ఉదయం ఆకుపచ్చగా, మధ్యాహ్నం నల్లగా, సాయంత్రం నీలంగా, రాత్రి తెల్లగా కనిపించే వస్తువు ఏది?" అని ఓ పరీక్షలో అడిగారు. ఈ ప్రశ్న చూసేలోపే, తల తిరుగుతుంది. నాలుగు సమయాల్లో నాలుగు రంగులు మార్చే వస్తువు ఏంటి? అని ఆశ్చర్యం కలుగుతుంది. కానీ దీని సమాధానం చాలా సింపుల్ – నాచు (ఆల్గే). నాచు అనేది నీటి దగ్గర పెరిగే ఒక రకమైన సూక్ష్మ జీవి. దీన్ని శిలీంధ్రం, ఆల్గే అని కూడా పిలుస్తారు. ఇది చెరువులు, నదులు, తేమతో ఉన్న గోడలపై పెరుగుతుంది. ఉదయం సూర్యరశ్మిలో ఇది ఆకుపచ్చగా కనిపిస్తుంది. మధ్యాహ్నం వేడిలో నల్లగా మారుతుంది. సాయంత్రం లైట్ తగ్గినప్పుడు ఇది నీలంగా కనిపించొచ్చు. రాత్రి చిమ్మ చీకట్లో ఇది తెల్లగా లేదా ఛాయా లాంటి రూపంలో కనిపించవచ్చు. ఇదే అసలు ప్రత్యేకత. ఈ తరహా ప్రశ్నలు అభ్యర్థుల్లోలో పరిశీలన, లోతైన ఆలోచన చేసే స్వభావాన్ని పెంచుతాయి. అలాగే సైన్స్, ప్రకృతి, భౌతిక శాస్త్రం వంటివాటిపై అవగాహనను పెంచుతాయి. ముఖ్యంగా UPSC, SSC వంటి పరీక్షల్లో ఇటువంటి ట్రిక్ ప్రశ్నలు చాలా సాధారణం. అందుకే, జనరల్ నాలెడ్జ్ అంటే రొటీన్ చదువు అనుకోకూడదు. ఆసక్తిగా చదివితే ఇది మస్త్ ఇంట్రస్టింగ్ టాపిక్గా మారుతుంది. పోటీ పరీక్షలు ఎంత గట్టిగా ఉండినా, సరైన ప్రిపరేషన్ ఉంటే మీరు విజయాన్ని అందుకోవచ్చు. అందులో జనరల్ నాలెడ్జ్ మీ బలం అవుతుంది. రోజూ 15–20 నిమిషాలు GKకి కేటాయించండి. వార్తలు చదవండి, కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి, క్యూరియస్ ప్రశ్నల మీద ఆలోచించండి. ఈ పద్ధతుల్లో మీరు మరింత మెరుగవుతారు. విజయం సాధించాలంటే కేవలం చదవడం సరిపోదు. తెలుసుకోవాలన్న ఆవేశం ఉండాలి. ఆ ఆవేశాన్ని ప్రేరేపించేది జనరల్ నాలెడ్జ్. కాబట్టి, నేటి నుంచే GK మీద ప్రాధాన్యత పెంచండి. అదే మీ రేపటి భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది.
2025-04-30T07:16:38Z
Watermelon: పుచ్చకాయ మీద ఉప్పు వేసుకుని తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే, లేదంటే!
కొందరికి పుచ్చకాయతో ఉప్పు కలిపి తిన్నప్పుడు గ్యాస్, వికారం, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. ఉప్పు శరీరంలో నీటిని నిలుపుదల చేస్తుంది, ఇది వాపు ఇతర సమస్యలకు దారితీస్తుంది. వేసవి కాలం వచ్చిందంటే చాలు, పుచ్చకాయ, కర్బూజ వంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్ల రాక పెరుగుతుంది. ప్రజలు పుచ్చకాయ వంటి పండ్లను కొని తినడం అలవాటు చేసుకుంటారు. కొందరు రుచి కోసం పుచ్చకాయతో ఉప్పు లేదా కారం పొడి, మిరియాల పొడి వంటివి కలిపి తింటారు. అయితే, రుచి కోసం పుచ్చకాయను ఉప్పుతో కలిపి తినడం నిజంగా మంచిదేనా, దీని వల్ల ఏమైనా ప్రమాదం ఉందా అనే దాని గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. వేసవిలో శరీరం నుంచి ఎక్కువగా చెమట బయటకు వెళ్లడం వల్ల, ఎక్కువగా నీరు తాగాలి. ఎందుకంటే, అధిక వేడి కారణంగా చెమట ద్వారా శరీరంలోని ఎలక్ట్రోలైట్లు తగ్గుతాయి. కాబట్టి, ఉప్పు వాటి లోటును పూరించడానికి సహాయపడుతుంది. కానీ ఉప్పును ఎక్కువగా తీసుకోవడం హానికరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రెండూ, అధిక ఉప్పు తీసుకోవడం అధిక రక్తపోటు ప్రమాదంతో సంబంధం కలిగి ఉందని పేర్కొన్నాయి. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం రక్తపోటును పెంచుతుంది. ఇది గుండె జబ్బులు, పక్షవాతం వంటి వాటి ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, అధిక మొత్తంలో ఉప్పు తీసుకోవడం కిడ్నీలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి పరిస్థితి మరింత దిగజారవచ్చు. కొందరికి పుచ్చకాయతో ఉప్పు కలిపి తిన్నప్పుడు గ్యాస్, వికారం, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. ఉప్పు శరీరంలో నీటిని నిలుపుదల చేస్తుంది, ఇది వాపు ఇతర సమస్యలకు దారితీస్తుంది. పుచ్చకాయ పండుతో ఉప్పు కలిపి తినడం గురించి ఖచ్చితమైన వైద్య పరిశోధన ఏమీ లేదు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, పుచ్చకాయలో పొటాషియం ఉంటుంది, ఇది ఒక ఎలక్ట్రోలైట్, అయితే ఉప్పులో సోడియం ఉంటుంది, ఇది పొటాషియంతో కలిసి శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది. పుచ్చకాయతో ఉప్పు కలిపి తినడం గురించి వైద్యులకు భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ పరిశోధకులు, వైద్యులు తక్కువ మొత్తంలో ఉప్పు తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బులు ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి, పుచ్చకాయతో ఉప్పు కలిపి తింటే, ఎక్కువ మొత్తంలో ఉప్పు తీసుకోకండి. ఎందుకంటే ఇది దుష్ప్రభావాలకు దారితీస్తుంది. కాబట్టి, మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, పుచ్చకాయతో ఉప్పు కలిపి తినే ముందు తప్పకుండా వైద్యుడు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది.
2025-04-30T14:01:59Z
ఈ ఫొటోలో మీరు ఫస్ట్ చూసింది ఏది?.. అది చూస్తే మాత్రం మీఅంత స్వార్థపరులు ఎవరూ ఉండరు!
Personality Test: ప్రస్తుతం సోషల్ మీడియాలో వివిధ ఆప్టికల్ ఇల్యూజన్స్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రజలు ఇలాంటి ఫోటోలను చూడటానికి ఇష్టపడతారు. ఇలాంటి ఫోటోల ద్వారా ప్రజలు తరచుగా వారి వ్యక్తిగత లక్షణాలు, మనస్తత్వం, స్వభావం అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి ఒక ఆహ్లాదకరమైన, ఆలోచింపజేసే ఇమేజ్ పర్సనాలిటీ టెస్ట్ ప్రస్తుతం చాలా చర్చించబడుతోంది. ఈ రోజు మనం అలాంటి ఒక అద్భుతమైన ఫోటోను చూడబోతున్నాం, అది మీ వ్యక్తిత్వ రహస్యాన్ని వెల్లడిస్తుంది. అయితే ఈ ఫోటోలో మీరు మొదట ఏమి చూశారో చెప్పండి.. పక్షి, స్త్రీ లేదా ఆకులు? మీరు మొదట చూసే దాని ఆధారంగా మీ స్వభావం అర్థం అవుతుంది. మీ స్వభావం గురించి కొన్ని ప్రత్యేక విషయాలను తెలుసుకుందాం. 1. మీరు మొదట పక్షులను చూసినట్లయితే...మీరు స్వభావరీత్యా కొంచెం స్వార్థపరులుగా ఉండవచ్చు. అంటే, మీరు మొదట మీ గురించి ఆలోచించి, మీ స్వంత ప్రయోజనాన్ని మరింత ముఖ్యమైనదిగా భావిస్తారు. కొన్నిసార్లు ఇది మీరు 'స్వార్థపరులు' అని ప్రజలు అనుకునేలా చేస్తుంది. 2. మీరు మొదట స్త్రీ ముఖాన్ని చూసినట్లయితే...మీకు చాలా పెద్ద మనసు ఉంది. మీరు స్వతహాగా చాలా భావోద్వేగభరితంగా, సహాయకారిగా ఉంటారు. మీరు ఎల్లప్పుడూ ముందుకు వచ్చి ఇతరుల సమస్యలలో సహకరించడానికి సిద్ధంగా ఉంటారు. 3. మీరు మొదట పడిపోయిన ఆకులను చూసినట్లయితే...మీ స్వభావం కొంత సోమరితనం, సౌకర్యవంతంగా ఉండవచ్చు. మీరు వీలైనంత వరకు అధిక శ్రమను నివారించండి. సాధ్యమైన చోట విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు. ఈ సరదా పరీక్ష మీ గురించి కొంచెం తెలుసుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి, ఇలాంటి ఇమేజ్ పరీక్షలను తేలికగా తీసుకుని, సొంత వ్యక్తిత్వంపై కొత్త దృక్పథాన్ని పొందడానికి ప్రయత్నించాలి.
2025-04-30T05:16:23Z
బ్రష్ చేసేటప్పుడు ఈ తప్పు చేస్తే.. 30 ఏళ్లకే ముసలోళ్ళు అయిపోతారంట..!
ఉదయాన్నే టూత్ బ్రష్ చేయడం ఎంత అవసరమో, దాన్ని సరైన విధంగా, సరైన సమయంలో చేయడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది ఎక్కువ సేపు బ్రష్ చేస్తే దంతాలు మరింత మెరుస్తాయని అనుకుంటారు. కానీ ఈ భావన తప్పు మాత్రమే కాదు, దంతాలకు కూడా హానికరం. రాంచీలోని పరాస్ ఆసుపత్రిలో దంతవైద్యురాలైన డా. సుకేషి తెలిపిన వివరాల ప్రకారం.. 30 నిమిషాలు బ్రష్ చేయడం పెద్ద సమస్యకు దారితీస్తుందని చెబుతున్నారు. మన దంతాలపై ఉండే లేత తెల్లని, సన్నని రక్షణ పొర ఉంటుంది. ఇది దంతాలకు మెరుపు ఇవ్వడంతో పాటు.. దంతాలను హానికారక బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది. అయితే ఎక్కువ సేపు బ్రష్ చేయడం ద్వారా ఆ పొర క్రమంగా తొలగిపోతుంది. డా. సుకేషి తెలిపిన వివరాల ప్రకారం ఈ రక్షణ పొరలో కాల్షియం ఉండటం వల్ల అది దంతాలను బలంగా, సురక్షితంగా ఉంచుతుంది. కానీ 15 నుండి 30 నిమిషాలు వరకూ బ్రష్ చేసినప్పుడు, ఈ పొరను రుద్దుతారు. దీని వల్ల దంతాలపై కుహరాలు ఏర్పడతాయి, దంతాల మధ్య అంతరాలు వస్తాయి మరియు అవి వేగంగా క్షీణించిపోతాయి. అతిగా బ్రష్ చేయడం వల్ల మసుడుల సహజ రక్షణ కూడా దెబ్బతింటుంది. దీని వల్ల దంతాలు బలహీనపడతాయి, అలాగే వైరస్లు, బ్యాక్టీరియాల వల్ల సంక్రమణకు అవకాశం పెరుగుతుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, కేవలం ఒకటి నుండి రెండు నిమిషాలపాటు సరైన పద్ధతిలో బ్రష్ చేయడం సరిపోతుందని డా. సుకేషి సూచిస్తున్నారు. వృత్తాకార కదలికలతో బ్రష్ చేయాలి. పైకి కిందకి, ఎడమ నుండి కుడి దాకా ప్రతి ప్రాంతాన్ని ఒకటి లేదా రెండు సార్లు శుభ్రం చేయాలి. రోజులో తరచూ బ్రష్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి సరైన రీతిలో చేయడం పూర్తిగా చాలు. (గమనిక: ఈ కథనం నిపుణుల అభిప్రాయం ఆధారంగా రాసినది.. దీనిని న్యూస్ 18 తెలుగు ధృవీకరించడం లేదు.)
2025-04-30T09:16:52Z
Cooler: ఇంట్లో కూలర్ వాడుతున్నారా..? ఈ తప్పు చేస్తే పేలుతుంది జాగ్రత్త..!
వేసవిలో నీరు లేకుండా కూలర్ను నడిపిస్తే గది మొత్తం తేమతో నిండిపోతుంది. అలాగే, దాని నుండి వచ్చే గాలికి కొంచెం వెచ్చదనం ఉంటుంది. దీన్ని నివారించడానికి, మీరు కూలర్లో నీరు కలిపిన తర్వాత మాత్రమే నడపాలి. ఇలా చేస్తే, మీ కూలర్ సరిగ్గా పనిచేస్తుంది. కానీ నీరు లేకుండా కూలర్ను ఉపయోగిస్తే, అది పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. కూలర్ ఎలా పనిచేస్తుంది: కూలర్ బయటి నుండి వేడి గాలిని తీసుకుంటుంది. తడి ప్యాడ్ గుండా వెళ్ళిన తర్వాత, అది గాలిని చల్లబరచి బయటికి వదులుతుంది. చల్లని గాలిని పొందడానికి, కూలర్లో నీరు ఉండటం ముఖ్యం. లేకుంటే, మీరు వేడి గాలితో పాటు తేమను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. పంపు: చాలా మంది కూలర్లో నీరు పెట్టకుండా, పంపును నడిపిస్తూనే ఉంటూ పొరపాటు చేస్తారు. ఇలా పదే పదే చేస్తే, అది పంపుపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. పంపు వేడెక్కి కాలిపోతుంది. దీని వల్ల కూలర్లో మంటలు చెలరేగే ప్రమాదం పెరుగుతుంది. ప్రతికూలతలు: నీరు లేకుండా ఎయిర్ కూలర్ను నడిపితే, అది మీ చర్మం, కళ్లను చికాకు పెట్టవచ్చు. అలాగే, శ్వాస సమస్యలు కూడా కలిగించవచ్చు. దుమ్ము: నీరు లేకుండా, కూలర్ కేవలం ఫ్యాన్గా మారి నడుస్తుంది. ఆ గాలిలో చల్లదనం ఉండదు. ఇలా చేయడం వల్ల మీరు వేడి గాలితో పాటు దుమ్ము, అలెర్జీలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
2025-04-30T10:01:27Z