CHAITRA NAVRATRI 2023 VASTU TIPS ఛైత్ర నవరాత్రుల వేళ దుర్గా మాత అనుగ్రహం కోసం ఈ వాస్తు చిట్కాలను పాటించండి...

Chaitra Navratri 2023 Vastu Tips తెలుగు పంచాంగం ప్రకారం, ఈ ఏడాది మార్చి 22వ తేదీ బుధవారం నుంచి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలి.

Chaitra Navratri 2023 Vastu Tips ఛైత్ర నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజుల పాటు 9 ప్రత్యేక రూపాల్లో దుర్గా దేవిని పూజిస్తారు. ఈ సమయంలో దుర్గా భవానీ భక్తులందరూ ఉపవాస దీక్షలను కొనసాగిస్తారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఇదిలా ఉండగా చైత్ర నవరాత్రుల వేళ వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో ఉండే వస్తువులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సమయంలో కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం వల్ల మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. వాస్తు దోష నివారణకు నవరాత్రులు ఉత్తమ సమయంగా పండితులు చెబుతారు. ఈ సమయంలో కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా ఏయే వాస్తు నివారణలు పాటించాలనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఇంట్లో సానుకూల శక్తి కోసం..

ఛైత్ర నవరాత్రుల వేళ మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రెండు వైపులా తొమ్మిది రోజుల పాటు పసుపుతో స్వస్తిక్ చిహ్నం ఉండేలా చూసుకోండి. దీంతో పాటు ఈశాన్య దిశలో అమ్మవారి విగ్రహం లేదా ఫొటో ఎదుట కలశం ప్రతిష్టించండి. ఈ దిశను దేవతా స్థానంగా పేర్కొంటారు. ఈ దిశలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించడం వల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రభావం పెరుగుతుంది.

Ugadi Panchangam 2023 ఉగాది రోజే పంచాంగ శ్రవణం చేయడానికి గల కారణాలేంటో తెలుసా...

దీపాన్ని ఏ దిశలో ఉంచాలంటే..

అమ్మవారిని పూజించే ముందు మీ పూజా గదిని శుభ్రం చేసి గంగాజలం చల్లుకోవాలి. మీరు ఏకశిలా దీపాన్ని వెలిగిస్తుంటే.. ఆ దీపాన్ని ఆగ్నేయ కోణంలో ఉంచాలి. ఈ దిశ అగ్నిని సూచిస్తుంది. ఈ దిశలో దీపాన్ని వెలిగించడం వల్ల శత్రువులపై విజయం సాధించి, మీరు ఇంట్లో సుఖ సంతోషాలతో ఉంటారు.

ఎర్రని వస్త్రంపై..

అమ్మవారి విగ్రహం లేదా ఫొటో, కలశం ప్రతిష్టించడానికి ముందు గంధపు చెక్కను ఉపయోగించడం చాలా మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం సానుకూల శక్తికి దీన్ని కేంద్రంగా పరిగణిస్తారు. గంధపు చెక్క లేకపోతే, ఏదైనా ఇతర చెక్కను కూడా వాడొచ్చు. అయితే దానిపై ఎర్రని వస్త్రం పరచాలి. అదే సమయంలో దీపాన్ని నేలపై ఉంచొద్దు. నేలపై ఉంచాల్సి వస్తే, బియ్యంతో అష్టభుజి వేసి దానిపై దీపం ఉంచాలి.

దీపాన్ని వెలిగించేందుకు ఏ నూనె వాడాలంటే..

ఛైత్ర నవరాత్రుల వేళ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించే ముందు నేతి దీపం వెలిగించి, ఆ తర్వాత మాత్రమే పూజా కార్యక్రమాన్ని ప్రారంభించాలి. మీరు ఏకశిలా దీపం వెలిగిస్తే, అందులోనూ నెయ్యి వాడొచ్చు. నెయ్యి అందుబాటులో లేకపోతే ఆవాలు, నువ్వుల నూనెను వాడొచ్చు. దుర్గా మాతకు కుడి వైపున మాత్రం దీపం పెట్టాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి.

ఎరుపు రంగునే వాడాలి..

వాస్తు శాస్త్రం ప్రకారం, నవరాత్రుల వేళ అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఎర్రని వస్త్రం, ఎర్రని రంగులో ఉండే పువ్వులను మాత్రమే వాడాలి. ఇవి శక్తి, బలానికి చిహ్నంగా పరిగణించబడతాయి. అయితే అమ్మవారి ఆరాధనలో ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లని రంగు వాడకూడదని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది అశుభమైనదిగా పరిగణిస్తారు.

గమనిక

: ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.

Read

Latest Astrology News

and

Telugu News

2023-03-23T11:02:46Z dg43tfdfdgfd