పెండ్లి ఇష్టం లేక మతం మార్చుకున్న యువతి

పెండ్లి ఇష్టం లేక మతం మార్చుకున్న యువతి

మెహిదీపట్నం, వెలుగు: పెండ్లి ఇష్టం లేక ఓ యువతి మతం మార్చుకున్న ఘటన లంగర్ హౌస్​ పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బీదర్​కు చెందిన సోని(23) తల్లిదండ్రులు చాలా ఏండ్ల కిందట బతుకుదెరువు కోసం సిటీకొచ్చి బాపునగర్​లో ఉంటున్నారు. కొన్నాళ్ల కిందట యువతి తండ్రి చనిపోయాడు. ఇటీవల సోనికి ఇంట్లో పెండ్లి సంబంధాలు చూస్తున్నారు.

పెండ్లి ఇష్టం లేకపోవడంతో మంగళవారం ఎవరికీ చెప్పకుండా యువతి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో బంధువులు లంగర్ హౌస్ పీఎస్​లో కంప్లయింట్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోనికి చిన్నప్పటి స్నేహితురాలైన అమ్రీన్​అనే యువతికి ఫోన్ చేసి విచారించారు. ఆమె దగ్గరే సోని ఉన్నట్లు తెలుసుకున్నారు. బుధవారం సాయంత్రం సోనిని తీసుకుని అమ్రీన్ ​లంగర్ హౌస్ పీఎస్​కు వచ్చింది. తనకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని, అందుకే తాను ఇస్లాం మతంలోకి మారినట్లు సోని పోలీసులకు చెప్పింది. కుటుంబసభ్యులు, బంధువులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో.. పోలీసులు యువతిని భరోసా సెంటర్​కు తరలించారు.

  ©️ VIL Media Pvt Ltd.

2023-06-08T03:18:55Z dg43tfdfdgfd