Duplex Apartment : ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ముంబైలోని బాంద్రా పాలి హిల్ ప్రాంతంలో అత్యంత విలాసవంతమైన డూప్లెక్స్ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. తన ప్రొడక్షన్ హౌస్ పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఈ ప్రాపర్టీని ఆయన ఏకంగా రూ. 30.6 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఇదే ప్రాంతంలో పృథ్వీరాజ్ ఆయన భార్య సుప్రియా మీనన్లు రూ. 17 కోట్ల విలువైన మరో అపార్ట్మెంట్ కలిగిఉన్నారు.
ఇక నటుడు కొనుగోలు చేసిన లగ్జరీ అపార్ట్మెంట్లో 3, 4,5 బీహెచ్కే అపార్ట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. పృథ్వీరాజ్ డూప్లెక్స్ 2971 ఎస్ఎఫ్టీలో విస్తరించిఉంది. ఈ అపార్ట్మెంట్కు నాలుగు కారు పార్కింగ్ స్పేసెస్ కేటాయించారు. సెప్టెంబర్లో ఈ లగ్జరీ అపార్ట్మెంట్ను పృథ్వీరాజ్ కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు స్టాంప్ డ్యూటీ కింద ఆయన రూ. 1.84 కోట్లు చెల్లించారు.
బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతం బాలీవుడ్ సెలబ్రిటీలు నివసించే అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందింది. గత కొద్ది నెలలుగా ఈ ప్రాంతంలో రణ్వీర్ సింగ్, తృప్తి డిమ్రీ, అథియా శెట్టి వంటి సినీ సెలబ్రిటీలతో పాటు క్రికెటర్ కేఎల్ రాహుల్ వంటి ప్రముఖులు ఖరీదైన అపార్ట్మెంట్లను కొనుగోలు చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే సలార్కు కొనసాగింపుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ 2లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.
Read More :
Hema Drugs Case | పరువు కోసం చచ్చిపోతా.. డ్రగ్స్ కేసులో మీడియాపై మండిపడిన హేమ
2024-09-16T12:56:24Z dg43tfdfdgfd