GOLDEN FLOWERS | శ్రీశైలం ఆలయానికి 108 బంగారు పూలు విరాళం

నంద్యాల : జిల్లాలోని ప్రసిద్ధ శ్రీశైలం (Srisailam) మల్లిఖార్జునస్వామి ఆలయానికి ఓ భక్తుడు 108 బంగారు పూలను ( Golden flowers ) విరాళంగా అందజేశారు. కర్నూలు(Kurnool) జిల్లాకు చెందిన బిసి శివకుమార్‌ అనే భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా అమ్మవారి ఆలయప్రాంగణంలో 19 గ్రాముల 108 బంగారు పూలను సీనియర్‌ వేదపండితులు, గంటి రాధకృష్ణ, పర్యవేక్షకులు కె. అయ్యన్న , ఆలయ ఇన్‌స్పెక్టర్‌ మల్లిఖార్జునకు అందజేశారు. దాతకు వేదాశీర్వచనముతో స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు.

2024-09-06T10:24:59Z dg43tfdfdgfd