VINAYAKA CHAVITHI : ఈ వినాయక చవితికి చేయాల్సిన 5 ప్రసాదాలని క్షణాల్లో తయారుచేయండిలా

Vinayaka chavithi : ప్రతిచోట వినాయక చవితి జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ సిద్ధమయ్యారు. ఈ పండుగ రోజన ఆ దేవుడికి క్షణాల్లో తయారయ్యే ప్రసాదాల గురించి తెలుసుకోండి.

వినాయకచవితి తెలుగు రాష్ట్రాల్లోనే మిగతా రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు. ఈ చవితి రోజున ఆ దేవుడికి ఇష్టమైన వంటకాలని వండిపెట్టి ఆ బొజ్జ గణపయ్య ఆశీస్సులు పొందాలనుకుంటారు. దీంతో పూజ ఎంత నిష్టగా చేస్తారో.. నైవేద్యాలు కూడా అంతే నిష్టగా చేస్తారు. అందులో కుడుములు, ఉండ్రాళ్ళు, పాలతాళికలు, పాయసం వంటి ట్రెడిషనల్ డిషెస్ ఉంటాయి. ఇవన్నీ త్వరగా ఎలా చేయాలో మరి తెలుసుకుని మీరు కూడా ఆ దేవుడికి ప్రసాదాలన్నింటిని వండి పెట్టండి. పానకం..

కావాల్సిన పదార్థాలుబెల్లంనీరుయాలకులుమిరియాలుతయారీ విధానం..ఓ కప్పులో బెల్లంలో నీరు పోసి కరగనివ్వండి. ఆ నీటిని వడపోయాలి. అందులో మిరియాలు, యాలకులని దంచుకోవాలి. దీనిని బెల్లం నీటిలో వేయాలి. అంతే పానకం రెడీ.

పాయసం..

1 కప్పు సేమియాపావు కప్పు చక్కెరయాలకులు500 మి.లీ జెర్సీ పాలు2 టేబుల్ స్పూన్ నెయ్యిసన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్..తయారీ విధానం..పాన్‌లో నెయ్యిని వేసి వేడి చేయండి. డ్రైఫ్రూట్స్ వేసి ఫ్రై చేసి పక్కనపెట్టండి. అవసరం అయితే పాన్‌లో నెయ్యి వేసి సేమియా వేసి చిన్న మంటపై ఫ్రై చేయండి. ఇప్పుడు పాన్‌లో నీరు పోసి అందులోనే వెర్మిసెల్లి వేసి ఉడకనివ్వండి. తర్వాత అందులో పంచదార పాలు వేయండి. చివరగా యాలకులు, డ్రైఫ్రూట్స్ వేసి కలపండి. పాన్‌ని 2 నుంచి 3 నిమిషాల పాటు సిమ్‌లో ఉంచి డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేయండి.

బెల్లం కుడుములు..

కావాల్సిన పదార్థాలు1 కప్పు బియ్యం పిండి2 కప్పుల నీరుసగం కప్పు బెల్లం తురుముపావు కప్పు తాజా కొబ్బరి తురుముపావు టీ స్పూన్ యాలకుల పొడి2 చెంచాల నెయ్యితయారీ విధానం..ముందుగా ఓ గిన్నెలో నీరు పోసుకుని మరిగించండి. అందులో బెల్లం వేసి పూర్తిగా కరగనివ్వండి. తర్వాత ఈ కరిగిన బెల్లం నీటిని వడకట్టి మరోసారి వేడి చేయండి. అందులోనే తాజా కొబ్బరి తురుము, యాలకుల పొడి వేయాలి. సిరప్ దగ్గర పడుతున్నప్పుడు కొద్దికొద్దిగా బియ్యం పిండి వేస్తూ కలపాలి. ఉండలు కట్టకుండా ఓ నిమిషం పాటు పిండిని కలపండి. తర్వాత మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. పిండి ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి కాస్తా చల్లారనివ్వాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసి కొద్దికొద్దిగా పిండి ముద్దని తీసుకుని గుండ్రంగా కుడుముల్లా చేయాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్‌కి కొద్దిగా నెయ్యి రాయాలి. బియ్యం ఉండలని ఈ ప్లేట్‌లో పెట్టాలి. పదినిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకుంటే సరిపోతుంది.

ఉండ్రాళ్ళు..

పావు కప్పు పచ్చి శనగపప్పు (అరగంట నానబెట్టుకోవాలి. కప్పు బియ్యం రవ్వ2 టీ స్పూన్ల నెయ్యిజీలకర్రసన్నగా తరిగిన పచ్చికొబ్బరిపాన్‌లో బియ్యం రవ్వ వేసి దోరగా ఫ్రై చేయాలి. వేగిన రవ్వని పక్కనపెట్టాలి. తర్వాత అదే పాన్‌లో 2 నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత జీలకర్ర, పచ్చికొబ్బరి వేసి దోరగా ఫ్రై చేయండి. ఇందులోనే పచ్చి శనగపప్పు నీరు లేకుండా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులోనే రెండున్నర కప్పుల నీరు వేయాలి. మరుగుతున్నప్పుడు ఉప్పు వేసి.. శనగపప్పు ఉడికిన తర్వాత రవ్వ వేయాలి. రవ్వని ఉడకనివ్వాలి. తర్వాత దానిని కాసేపు చల్లారనివ్వండి. దీనిని లడ్డూల్లా చేయాలి. లేదా బుల్లెట్స్‌లా ఉంచండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్‌కి కొద్దిగా నెయ్యి రాసి అందులో బియ్యం రవ్వ ఉండ్రాళ్ళు వేసి 15 నిమిషాలు ఉడకనివ్వండి. అంతే బియ్యం నూక ఉండ్రాళ్ళు రెడీ అయినట్లే.

పాలతాళికలు..

కావాల్సిన పదార్థాలు..బియ్యం పిండిపాలుబెల్లంనెయ్యిసగ్గుబియ్యంతయారీ విధానం..ముందుగా పాలలో కొద్దిగా నీరు వేసి మరిగించుకోవాలి. మరుగుతున్నప్పుడు సగ్గుబియ్యాన్ని కూడా వేసి ఉడికించుకోవాలి. ఈలోపు బియ్యంపిండిలో నీరు వేసి తాలికల్లా చేయాలి. దీనికోసం మురుకుల మేకర్ వాడొచ్చు. ఈ తాలికలని మరుగుతున్న పాలలో వేసి ఉడికించాలి. ఈ జంతికలు అతుక్కోకుండా కలపాలి. తాలికలు ఉడికేలోపు బెల్లం, పంచదార కలిపి పాకం పట్టి చల్లారనివ్వాలి. తాలికలు ఉడికిన తర్వాత దించేసి చల్లారిన పాకంలో యాలకుల పొడి వేసి కలపాలి. అంతే పాల తాలికలు సిద్ధమైనట్లే. ఈ వంటకాన్ని వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-09-07T01:07:58Z dg43tfdfdgfd