తల్లి చనిపోయింది.. తండ్రి జైలుకు వెళ్లాడు.. ఆ పిల్లల కష్టాలకు కన్నీళ్ళు రావాల్సిందే !

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ సంసారం పచ్చగా నాలుగు కాలాలు కూడా ఉండలేదు. భార్యను, 3సంవత్సరాల తన కొడుకును, తన ఇద్దరు ఆడపిల్లలను ఆ మహిళను తాగి వచ్చి ఇబ్బందులకు గురి చేసేవారు. అయితే ఆ ఇంట జరిగిన ఓ విషాద ఘటన ఆ పిల్లలను అనాధలుగా మార్చింది. కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు, తినడానికి తిండి కూడా లేదు, దాతల సహాయం కోసం ఆ పిల్లలు ఎదురుచూపులు చూస్తున్నారు.

వివరాల్లోకెళ్తే.. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మండల పరిధిలోని కడపర్తి గ్రామానికి చెందిన దాసరి వీరయ్య, రాములమ్మ దంపతుల కుమార్తె సరిత. ఈమె సూర్యాపేటలోని బ్రహ్మచారిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమెకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. చేసుకున్నవాడే కాలయముడై సరితని చంపాడు. దీనితో ఆ ముగ్గురు పిల్లలు అనాధలుగా మిగిలిపోయారు. ఈ ఘటనపై లోకల్ 18 ఆ పిల్లలను, వారి అమ్మమ్మను పలకరించగా పలు వివరాలు తెలిపారు.

ఈ దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత బాబు పుట్టేంతవరకు కుటుంబం సాఫీగా సాగింది. బ్రహ్మచారి సబ్ స్టేషన్ లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. మందుకు బానిసై ఉద్యోగం సరిగా చేయక ఉద్యోగం నుండి సైతం అతడిని తీసివేశారు. దీనితో ఇంకా ఎక్కువ ఆర్థిక ఇబ్బందుల వల్ల మద్యానికి బానిసయ్యాడు. తన భర్తతో గొడవ పడ్డ సరిత తన పుట్టింటికి వచ్చింది.

అలా 2 నెలల తర్వాత తిరిగి సూర్యాపేట వెళ్లి తన భర్తను మార్చుకుంటానని చెప్పి ఇద్దరు ఆడపిల్లలను ఇక్కడే ఉంచి బాబును తీసుకొని పోయిందని మృతురాలు సరిత తల్లి తెలిపారు. ఒక రోజు ఏమైందో ఏమో తెలియదు కానీ ..గాఢ నిద్రలో ఉన్న సరిత నిద్రపోతూ ఉంటే మధ్య రాత్రి గమనించి కరెంటు వైర్ తో బిగించి చంపేశాడని.. ఇలా తన మనువడు తెలిపినట్లు సరిత తల్లి తెలిపింది. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారని చెప్పింది. తమకు ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేని పరిస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు ఆ చిన్నారులు. మానవతావాదులు స్పందించి పిల్లలకు ఆపన్నహస్తం అందించాలని లోకల్ 18 తో సరిత తల్లి కోరారు.

2024-09-16T04:36:31Z dg43tfdfdgfd