ప్రతిసారి లేపుకుని వచ్చేవాడివి, ఈసారి పడుకోబెట్టుకుని వచ్చావేంటి? ఛీ ఛీ శ్రీముఖి నోటి వెంట పచ్చి బూతులు!

బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి పచ్చి బూతులతో రచ్చ చేసింది. అందరి ముందు డబుల్ మీనింగ్ జోక్స్ వేసింది. లేటెస్ట్ షోలో శ్రీముఖి బూతు జోకులు వేయడం చర్చకు దారి తీసింది. 

 

స్టార్ మా లో సందడి మొత్తం శ్రీముఖిదే. ఆమె పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. తాజాగా శ్రీముఖి నీతోనే డాన్స్ 2.0 షో స్టార్ట్ చేసింది. సదరు షోలో శ్రీముఖి డబుల్ మీనింగ్స్ జోక్స్ తో నవ్వించే ప్రయత్నం చేసింది. 

 

నీతోనే డాన్స్ షోకి జడ్జెస్ గా సదా, తరుణ్ మాస్టర్, సీనియర్ హీరోయిన్ రాధ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరు బీబీ జోడి, నీతోనే డాన్స్ ఫస్ట్ సీజన్ కి జడ్జెస్ గా ఉన్నారు. నీతోనే డాన్స్ 2.0 లో మరోసారి తమ ఎనర్జీతో కంటెస్టెంట్స్ లో జోష్ నింపనున్నారు. 

సీరియల్ నటులు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కలగలిపి ఏడు టీమ్స్ వరకు నీతోనే డాన్స్ 2.0లో పార్టిసిపేట్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ మానస్-శుభశ్రీ ఒక జోడి. ప్రిన్స్ యావర్-నయని పావని మరొక జోడి. నటుడు విశ్వ-నేహా చౌదరి ఇంకో జోడీ. 

 

బాలాదిత్య-పూజ మూర్తి, సీరియల్ నటులు దర్శిని గౌడ-పృథ్వి శెట్టి, విష్ణు-వరలక్ష్మి, ఏక్ నాథ్-హారిక జోడీలుగా పోటీపడుతున్నారు. వీరిని శ్రీముఖి పరిచయం చేసింది. మొదట జడ్జెస్ ని తర్వాత కంటెస్టెంట్స్  తో శ్రీముఖి మాట్లాడింది. 

 

మానస్ ని ఉద్దేశించి మాట్లాడుతూ...ప్రతిరోజూ వచ్చేటప్పుడు లేపుకుని వస్తావ్, ఈసారి పడుకోబెట్టుకుని వచ్చావ్ ఏంటీ..? అని శ్రీముఖి అంది. దాంతో జడ్జెస్ తో పాటు కంటెస్టెంట్స్ అవాక్కయ్యారు. నేను అంటుంది  జుట్టు గురించి అంటూ శ్రీముఖి కవర్ చేసింది. 

 

ఆమె డబుల్ మీనింగ్ జోక్ దెబ్బకు అందరికీ మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ రేంజ్ లో పచ్చి బూతులు మాట్లాడుతున్న తీరుకు సోషల్ మీడియా జనాలు కూడా నివ్వెరపోతున్నారు. ఆ మధ్య విమర్శలు రావడంతో బుల్లితెర మీద డబుల్ మీనింగ్ జోక్స్ డోసు తగ్గించారు. మరలా జబర్దస్త్ తో పాటు పలు బుల్లితెర షోలలో ఏ తరహా జోక్స్ వినిపిస్తున్నాయి. 

 

కమెడియన్స్ కి మించి శ్రీముఖి పచ్చి జోక్స్ వేస్తుంది. ఇక నీతోనే డాన్స్ 2.0 విన్నర్ ఎవరు అవుతారనే ఆసక్తి నెలకొంది. అన్ని జంటలు ఒకరికి మించి మరొకరు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బుల్లితెర ప్రేక్షకులు నీతోనే డాన్స్ 2.0 ఫీస్ట్ అనడంలో సందేహం లేదు. 

2024-03-29T09:46:13Z dg43tfdfdgfd