ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. ఏంటని అనుకుంటున్నారా.. ఉచితంగానే వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్లు, టీవీలు లభించాయి. అదేలా అని అనుకుంటున్నారా.. అయితే మీరు ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే. ఇటీవల విజయవాడ వరదల్లో చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం కూడా సంభవించింది. దీంతో వారిని ఆదుకోవడానికి టీడీపీ నేత ముందుకు వచ్చారు.
మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వరద బాధితులకు అండగా నిలిచారు. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల ఇళ్ళు వరదలో మునిగి వారి నష్టపోగా వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు నా వంతు సాయంగా వారికి కొత్త ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మిషన్లు, టివిలు కొనుగోలు ఉచితంగనే అందించారు. సతీమణి భూలక్ష్మి, అల్లుడు రవీంద్ర చేతుల మీదుగా అందించారు.
రేషన్ కార్డు కలిగిన వారికి భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే గుడ్ న్యూస్!
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అంతేకాకుండా నగర ప్రజల కష్టాలు, బాధలు తీవ్ర ఆవేదనకు గురి చేశాయని తెలిపారు. అందుకే తన వంతు బాధ్యతగా సీఎం రిలీఫ్ ఫండ్కు రూ. 5 లక్షల విరాళంగా అందజేసినట్లు వెల్లడించారు. భారీ వరదల కారణంగా విజయవాడ కకావికలం అయ్యిందని చెప్పుకోవచ్చు.
2024-09-16T03:06:30Z dg43tfdfdgfd