Trending:


Sankranti: సంక్రాంతిరోజు నువ్వులు బెల్లం కలిపి పంచడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి, ఆ రోజు ఇలా చేయండి

Sankranti: మకర సంక్రాంతిని భారతదేశంలో అతిపెద్ద పండుగలాగా నిర్వహించుకుంటారు. సంక్రాంతి పండుగను భారతదేశం అంతటా వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ పండుగ ప్రత్యేకతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.


Soaked Raisins: చలికాలంలో కిస్మిస్‌లు తింటున్నారా.. దీని వల్ల ఏం జరుగుతుందో తెలుసా..

చలికాలం వస్తే చాలు చాలా మంది వేడి వేడి డ్రింక్స్‌, ఫుడ్స్‌ వైపు ఆసక్తి చూపిస్తారు. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకునేందుకు పోషకాలు ఎక్కువగా ఉండే వాటిపై దృష్టి సారిస్తారు. కానీ, చాలా మంది ఎండు ద్రాక్ష లేదా కిస్మిస్‌లను (Raisins) విస్మరిస్తుంటారు. హై లెవల్ న్యూట్రియెంట్స్‌ ఉండే ఈ డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తింటే ఇంకా మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే మీ వింటర్‌ డైట్‌లో ఇవి కచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఈ సీజన్‌లో కిస్మిస్‌లతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో...


సంక్రాంతి స్పెష‌ల్ రాజస్థాన్ ఘేవ‌ర్ స్వీట్.

పండగలు అనగానే అందరికీ ముందుగా గుర్తుకువచ్చేవి ప్రత్యేక వంటకాలు. ఏ పండగకు ఆ వంటకాలను ఆరగించటం ఆనవాయితి. ఇక సంక్రాంతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సకినాలు, వడియాలు, చేగోడేలు, అప్పాలు వంటి పిండివంటకాలు సంక్రాంతి స్పెషల్ అని అందరికీ తెలిసిందే. కానీ నిజామాబాద్ నగర ప్రజలకు మాత్రం సంక్రాంతి పండగకు ఓ స్వీట్ ప్రత్యేకం. అదే ఘేవర్ స్వీట్, కేవలం సంక్రాంతి సమయంలోనే లభించే ఈ స్వీట్ మాధుర్యమేంటి, ఎందుకు ఇక్కడి ప్రజలు ఘేవర్ స్వీట్ ను అంతగా ఇష్టపడుతారో...


Panchangam Today: నేటి పంచాంగం.. మకర సంక్రాంతి రోజు ఈ సమయం అద్భుతం!

Panchangam Today: నేడు 13 జనవరి 2025 సోమవారం, మకర సంక్రాంతి, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్యమాసం - బహుళపక్షం. ఇవాళ 6 గంటల 38 నిమిషాలకు సూర్యోదయం అవుతుంది. నేడు సాయంత్రం 5 గంటల 39 నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిధి: పాడ్యమి రాత్రి 3 గంటల 22 నిమిషాల వరకూ వారం: (జయవాసరె) నక్షత్రం: పునర్వసు ఉదయం 10 గంటల 19 నిమిషాల వరకూ యోగం: విష్కంభ రాత్రి 2 గంటల 59 నిమిషాల వరకూ కరణం: బాలవ మధ్యాహ్నం 3 గంటల 39 నిమిషాల నుంచి కౌలవ రాత్రి 3 గంటల 22 నిమిషాల వరకూ అమృతకాలం ఉదయం 7 గంటల 57 నిమిషాల నుంచి 9 గంటల 31 నిమిషాలు మరియు రా.తె. 4 గంటల 03 నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాల వరకు ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 09 గంటల 06 నిమిషాల నుంచి 9 గంటల 50 నిమిషాలు మరియు రాత్రి 11 గంటల 07 నిమిషాల నుంచి 11 గంట 59 నిమిషాల వరకూ ఉంటుంది. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకూ ఉంటుంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఇవాళ వర్జ్యం సాయంత్రం 6 గంటల 22 నిమిషం నుంచి 7 గంటల 59 నిమిషాల వరకు ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


నలుగురు పిల్లలను కంటే రూ. లక్ష బహుమతి

నలుగురు పిల్లలను కంటే రూ. లక్ష బహుమతి బ్రాహ్మణ జంటలకు మధ్యప్రదేశ్​బ్రాహ్మణ బోర్డ్ చీఫ్ ఆఫర్ భోపాల్: దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఒక్కో బ్రాహ్మణ జంట నలుగురు పిల్లలను కనడం చాలా ముఖ్యమని మధ్యప్రదేశ్ బ్రహ్మణ బోర్డు ‘‘పరశురామ కల్యాణ్ బోర్డ్” ప్రెసిడెంట్ పండిట్ విష్ణు రాజోరియా పిలుపునిచ్చారు. నలుగురు పిల్లలను కనే జంటలకు లక్ష రూపాలయ బహుమతి ఇస్తామని ...


Godavari alludu food | 470 Food Items For Son In Law For sankranti festival |#local18shorts

సంక్రాంతికి రాకముందే భోగి రోజు కాకినాడ సమీపంలో ఉన్న యానాంకి ఒక అల్లుడు మొదటి సంవత్సరం పండక్కి వచ్చారండి ఇంకేముంది. అల్లుడు గారి రాకతో అల్లుడు గారికి రక రకాల వంటకాలు పెట్టాలనుకున్న ఆ ఇంటి అత్త మామ ఏకంగా 470 రకాల ప్యూర్ వెజటీరియన్ వంటకాలు అల్లుడు ముందు తినమని పెడితే ఒక్కసారిగా ఆ వంటలు చూసిన అల్లుడు అవాక్కయ్యారండి.. ఒకసారి ఆ వివరాలు చూద్దాం రండి.#sankranthicelebrations #godavari #fooditems -----------------------------------------------------------------------------------------Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 TeluguFollow us: Subscribe: https://www.youtube.com/@News18TeluguWebsite: https://telugu.news18.com/Whatsapp: https://whatsapp.com/channel/0029VaBicceHLHQaaV6fWs2NFacebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18TeluguInstagram: https://www.instagram.com/news18telugu/News18 Mobile App - https://onelink.to/desc-youtube


తాటి బెల్లంతో కలిగే లాభాలు ఇవే!

తాటి బెల్లంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తాటి బెల్లవ వల్ల కలిగే లాభాల గురించి ఇక్కడ వివరించాం.


శీతాకాలంలో తినాల్సిన కూరగాయలు ఇవే

చలికాలంలో తినాల్సిన ఆహారాల గురించి ఇక్కడ వివరించాం. ఈ ఫుడ్స్‌ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. పలు సమస్యలు దూరం అవుతాయి.


ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు ఇవే

కండరాలను దృఢంగా మార్చడంలో, ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో ప్రోటీన్ సహాయపడుతుంది. ప్రోటీన్ ఎక్కువగా లభించే ఆహారాల గురించి ఇక్కడ వివరించాం.


New Clothes: కొత్త బట్టలు వేసుకుంటున్నారా..? ఐతే ఈ పని తప్పకుండా చేయండి..!

కొత్త బట్టలు కొన్నప్పుడు కలిగే ఆనందం వేరు. వాటిని ఎప్పుడెప్పుడు తొడుక్కుందామా అనిపిస్తుంది. అయితే ఈ కొత్త డ్రెస్ (New dress) వేసుకునే ముందు ఉతకాలా వద్దా? అనే సందేహం చాలామందికి కలుగుతుంది. నిపుణులు మాత్రం తప్పకుండా ఉతకాలి అని గట్టిగా చెబుతున్నారు. ఆరోగ్యం, భద్రత కోసం వాటిని వాష్ చేయడం తప్పనిసరి అంటారు. కొత్త బట్టలు రకరకాల రసాయనాలతో తయారవుతాయి. రంగులు వేయడానికి, ముడతలు పడకుండా ఉండటానికి, మరకలు అంటకుండా ఉండటానికి ప్రత్యేకమైన కెమికల్స్ వాడతారు. వీటిని ఎక్కువసేపు చర్మానికి టచ్ కావడం అంత మంచిది కాదు. శాస్త్రవేత్తల ప్రకారం.. కొన్ని రకాల రంగులు బట్టలకు గట్టిగా అతుక్కోవు. అవి చర్మానికి అంటుకుని దురదలు, దద్దుర్లు వచ్చేలా చేస్తాయి. అందుకే బట్టలు ఉతకడం వల్ల ఆ రంగులు తగ్గి, చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు, డెర్మటాలజిస్ట్ డాక్టర్ జెఫ్ యూ ప్రకారం, ముడతలు పడని కాటన్ షర్టులు, యూనిఫామ్స్‌లో ఫార్మాల్డిహైడ్ రెసిన్ (Formaldehyde resin) అనే రసాయనాన్ని వాడతారు. ఇది క్యాన్సర్ కారకం అని తేలింది. అందుకే విద్యార్థులు, ఇతరులు యూనిఫామ్స్‌ను కచ్చితంగా ఉతకడం తప్పనిసరి. కొన్న చోటుతో సంబంధం ఉందా?.. మీరు బట్టలు కొనే ప్లేస్‌ను కూడా జాగ్రత్తగా గమనించాలి. షాపుల్లో కొనే బట్టలకు తయారీ సమయంలో వాడే కెమికల్స్ తక్కువగా ఉండొచ్చు కానీ, దుమ్ము, షాపుల్లో వాడే స్ప్రేలు వంటివి అంటుకునే అవకాశం ఉంది. బొమ్మలకు వేసిన బట్టలకు బోలెడు దుమ్ము పేరుకుపోయి ఉంటుంది. సెకండ్ హ్యాండ్ బట్టలైతే అలర్జీ కారకాలు, రకరకాల సువాసనలు కలిగి ఉంటాయి. అందుకే ఎక్కడ కొన్నా తొడుక్కునే ముందు ఉతకడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఒక విషయం.. బట్టలు ఉతకడం వల్ల కొన్ని రసాయనాలు తగ్గుతాయే కానీ పూర్తిగా పోవు. పాలిస్టర్ లాంటి సింథటిక్ బట్టలైతే రసాయనాలను గట్టిగా పట్టుకుంటాయి. అవి చర్మానికి అంత త్వరగా అంటుకోకపోయినా, కొందరికి మాత్రం చికాకు కలిగిస్తాయి. మీకు ఏదైనా కెమికల్ అలర్జీ ఉందని అనుమానం వస్తే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను కలిసి ప్యాచ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఒక్కోసారి బట్టలు గరుకుగా ఉండటం వల్ల కూడా చర్మం సున్నితంగా మారొచ్చు, దానిని అలర్జీ అని పొరపాటు పడకూడదు. కొత్త బట్టలు ఎలా ఉతకాలి.. కొత్త బట్టలు ఉతికేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటిసారి వాటిని వేరే బట్టలతో కలపకుండా విడిగా ఉతకాలి. బట్టల లేబుల్‌పై ఇచ్చిన సూచనలు తప్పకుండా పాటించాలి. చల్లటి నీటిలో ఉతకడం వల్ల బట్టలు పాడవకుండా ఉంటాయి. ఒకవేళ లేబుల్‌పై 'ఒకే రంగు దుస్తులతో ఉతకవద్దు (Wash with like colors) అని ఉంటే, ఆ బట్ట రంగు వదిలే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి. డ్రై క్లీనింగ్ చేయాల్సిన బట్టలైతే వేసుకునే ముందు డ్రై క్లీనింగ్ చేయించాలి. దీనివల్ల మిగిలిపోయిన రసాయనాలు తొలగిపోతాయి. ఒకవేళ లేబుల్‌పై "డ్రై క్లీనింగ్ రికమండెడ్ (Dry clean recommended)" అని ఉంటే, మీరు ఇంట్లో చేతులతో కూడా ఉతకడానికి ప్రయత్నించవచ్చు.


బాదం పప్పులు అతిగా తింటున్నారా? కిడ్నీలో stones వచ్చే ప్రమాదం, ఈ ఫుడ్స్‌తో కూడా బీ అలర్ట్

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే తాజా కూరగాయలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తినాలని వైద్యులు సజెస్ట్ చేస్తుంటారు. ముఖ్యంగా, విటమిన్లు, మినరల్స్, ఇతర సూక్ష్మ పోషకాలు ఉండే బాదం పప్పు (Almonds)లను రోజువారీ డైట్‌లో చేర్చుకోవాలని చెబుతుంటారు. ఇందులో హెల్తీ ఫ్యాట్స్, ప్రొటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో మెదడు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. వీటిని తింటే ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. అయితే, ప్రతి రోజు బాదం తినడం ఎంత ముఖ్యమో.. వాటిని లిమిట్‌లో...


ఇంట్లో బ‌ల్లుల‌కు చెక్ పెట్టేందుకు చిట్కాలు

ఇంట్లో బ‌ల్లులు గోడ‌ల‌పై తిరుగుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవి మ‌న వంట‌ల్లో ప‌డ‌తాయేమోన‌ని చాలా భ‌య‌ప‌డ‌తాం. ఇంట్లో బ‌ల్లుల‌ను చెక్ పెట్టేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


Sprouts Paneer Tikki: సాయంత్రం సరదాగా స్నాక్స్ తినాలని ఉందా...? మొలకలు, పనీర్‌తో హెల్తీగా ఇలా టిక్కీ చేసుకోండి

Sprouts Paneer Tikki: పండుగ పూట అంతా కలిసి సరదాగా ఏవైనా స్నాక్స్ చేసుకుని తినాలనుకుంటున్నారా? టేస్ట్‌తో పాటు మీరు హెల్త్‌కి కూడా ప్రియారిటీ ఇస్తారా? అయితే ఈ హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ మీ కోసమే. మొలకలు, పనీర్‌తో తయారు చేసే ఈ టిక్కీ మీ సాయంత్రానికి సరదాతో పాటు ఆరోగ్యాన్ని కూడా జోడిస్తుంది.


పాలకూర పనీర్ పులావ్ ఇలా చేస్తే రుచిగా!

పాలకూర, పనీర్ కలిపి పులావ్ చేసుకుంటే ఎంతో బాగుంటుంది. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి తెలుసుకుందాం.


కోడిపందేల కంటే తగ్గేదే లే.. కుమ్మేసుకున్న పందులు.. గెలిస్తే ఏమిస్తారో ఊహించలేరు!

సంక్రాంతి పండుగంటే కోళ్లు, ఎడ్ల పందేలు కామన్.. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం జస్ట్ ఫర్ ఛేంజ్ అంటున్నారు. కోళ్లు, ఎడ్లపందేలతో పాటుగా అక్కడ పందుల పోటీలు కూడా జరుగుతున్నాయి. ఇక పందుల పోటీలలో పాల్గొనడానికి ఇతర జిల్లాల నుంచి కూడా పందులను తీసుకురావటం విశేషం. ఇవే ప్రత్యేకతలు అంటే.. వీటిని చూడటానికి ఇక జనం కూడా భారీగా తరలిరావటంతో మరో విశేషం. అయితే ఇంతా జరిగితే పందుల పోటీలలో గెలిచిన వారికి ప్రైజ్ మనీ ఇవ్వరట. కేవలం షీల్డ్స్ మాత్రమేనని నిర్వాహకులు...


Sankranti Ratham Muggu Speciality: సంక్రాంతి, కనుమ రోజు రథం ముగ్గు ఎందుకు వేస్తారో తెలుసా?

Sankranti Ratham Muggu Speciality: సంక్రాంతి, కనుమ రోజు రథం ముగ్గు ఎందుకు వేస్తారో తెలుసా?


మమ్మేలు మల్లన్నా..

జానపదుల జాతరగా పేరొందిన ఐనవోలు బ్రహ్మోత్సవాలకు సోమవారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మమ్మేలు మల్లన్నా అంటూ స్వామిని వేడుకున్నారు. భోగి పండుగ పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో ఆలయం పోటెత్తింది.


ఎందుకు ‘నెంబర్ ప్లేట్స్’ వేర్వేరు రంగుల్లో ఉంటాయి? 10 రకాల నంబర్ ప్లేట్స్‌ ఇవే!

మీరు రకరకాల వాహనాలపై నంబర్ ప్లేట్‌లను గమనించి ఉంటారు, కానీ కొన్ని వాహనాల నంబర్ ప్లేట్ భిన్నంగా ఉంటాయి. ఇంతకీ ఆ నెంబర్ ప్లేట్ల వెనుక కారణం ఏమిటి? మరి వివిధ రంగుల ప్లేట్లు ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా..? తెల్లని నంబర్ ప్లేట్: ఈ తెల్లని నంబర్ ప్లేట్ సాధారణంగా భారతదేశంలో కనిపిస్తుంది. ఈ రకమైన ప్లేట్‌లు తెలుపు నేపథ్యంలో నలుపు రంగులో నమోదు సంఖ్యను కలిగి ఉంటాయి. వ్యక్తిగత అవసరాల కోసం వ్యక్తులు ఉపయోగించే వాహనాలకు ఈ తెల్లని నంబర్ ప్లేట్ వర్తిస్తుంది. అందువల్ల ఈ వాహనాలు కిరాయికి సరుకులు లేదా ప్రయాణీకులను తీసుకెళ్లకూడదనే నిబంధన ఉంది. పసుపు నంబర్ ప్లేట్: ఈ నంబర్ ప్లేట్‌లు పసుపు నేపథ్యంలో నలుపు రంగులో ముద్రించబడిన రిజిస్ట్రేషన్ నంబర్‌లను కలిగి ఉంటాయి. ఈ ప్లేట్లు సాధారణంగా టాక్సీ, ఆటో, కార్గో వాహనాలు వంటి వాణిజ్య వాహనాలకు వర్తిస్తాయి. ఈ వాహనాల పన్ను రేటు కూడా ప్రైవేట్ వాహనాల కంటే భిన్నంగా ఉంటుంది. గ్రీన్ నంబర్ ప్లేట్: ప్రస్తుతం మన దేశంలో గ్రీన్ నంబర్ ప్లేట్ల సంఖ్య పెరుగుతోంది. ఈ రకమైన ప్లేట్ ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. రిజిస్ట్రేషన్ నంబర్ తెలుపు రంగులో రాసి ఉంటే అది ప్రైవేట్ వాహనం. ఆకుపచ్చ నంబర్ ప్లేట్‌పై పసుపు రంగులో వ్రాసిన వాహనం వాణిజ్య విద్యుత్ వాహనం. ఈ వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా కమర్షియల్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలనే నిబంధన కూడా ఉంది. బ్లూ కలర్ నంబర్ ప్లేట్: విదేశీ ఎంబసీలు, బ్లూ కలర్ నంబర్ ప్లేట్‌లలో రిజిస్ట్రేషన్ నంబర్ తెలుపు రంగులో వ్రాయబడి ఉంటుంది. ఈ నంబర్ ప్లేట్లలో CC, UN, CD అనే మూడు రకాల కోడ్ లైన్లు ఉంటాయి. రెడ్ కలర్ నంబర్ ప్లేట్: వాహనాల రిజిస్ట్రేషన్ వివరాలను తాత్కాలికంగా నమోదు చేయడానికి ఈ రకమైన ప్లేట్లను ఉపయోగిస్తారు. ఇది ఎరుపు నేపథ్యంలో తెలుపు రంగులో వ్రాసిన సంఖ్యలను కలిగి ఉంది. రోడ్డు రవాణా కార్యాలయం నుండి శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ పొందే వరకు ఈ ప్లేట్లు ఇస్తారు. ఇది ఒక నెల మాత్రమే చెల్లుబాటు అవుతుంది. చాలా రాష్ట్రాలు ఈ ప్లేట్లు ఉన్న వాహనాలను రోడ్లపైకి అనుమతించవు. పైకి బాణాలతో కూడిన నంబర్ ప్లేట్: ఈ రకమైన నంబర్ ప్లేట్లు సైనిక వాహనాలకు మాత్రమే వర్తిస్తాయి. మొదటి లేదా రెండవ అక్షరం తర్వాత బాణం గుర్తులను విస్తృత బాణాలు అంటారు. ఈ బాణాలను అనుసరించే సంఖ్యలు వాహనం కొనుగోలు చేసిన సంవత్సరాన్ని సూచిస్తాయి. తదుపరిది మిలిటరీ బేస్ కోడ్‌ను సూచిస్తుంది. బ్లాక్ నంబర్ ప్లేట్ : బ్లాక్ ప్లేట్ పై పసుపు రంగులో రిజిస్ట్రేషన్ నంబర్ రాసి ఉంటే అది విలాసవంతమైన హోటల్ కు చెందిన వాహనం. ఇది వాణిజ్య వాహనంగా పరిగణించబడుతుంది. అయితే, దాని డ్రైవర్లు వాణిజ్య వాహనం కోసం డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలసిన అవసరం లేదు. ఎరుపు పలకపై భారతదేశ జాతీయ చిహ్నం: ఇటువంటి నంబర్ ప్లేట్లు భారత రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్ల వాహనాలకు మాత్రమే అమర్చబడతాయి. భారత్ సిరీస్: 'BH' ఉన్న భారత్ సిరీస్ నంబర్ ప్లేట్‌లతో ప్రజలు తమ వాహనాలను కూడా సూచించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, నాలుగు, అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో కార్యాలయాలు కలిగి ఉన్న ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు తమ కార్లపై ఈ భారత్ సిరీస్ నంబర్ ప్లేట్‌లను ఉపయోగించవచ్చు. వాహన యజమానులు ఇతర రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలకు వెళ్లినప్పుడు తిరిగి నమోదు చేసుకునే ఇబ్బందులను తొలగించేందుకు ఈ నంబర్ ప్లేట్లను ప్రవేశపెట్టారు.


Kanuma Recipe: కనుమ రోజు అల్లం గారెలు ఇలా చేస్తే చికెన్ కూరతో అదిరిపోతాయి

Allam Garelu: గారెలు పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఇక అల్లం గారెలు వండితే మామూలుగా ఉండదు. చికెన్ గ్రేవీతో ఈ గారెలను తింటే అద్భుతంగా ఉంటుంది.


ఇదేందయ్యా ఇది.. కోస్తాలో కాదు తెలంగాణలో కోడి పందాలు జోరు..

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎంతో ఉత్సాహం కలుగుతుంది. ముచ్చటగా మూడు రోజులపాటు ఇంటిల్లిపాది అంతా కలిసి సందడిగా గడిపే పండుగ ఇది. విద్య, ఉద్యోగం, ఉపాధి తదితర కారణాలతో ఎక్కడెక్కడో స్థిరపడ్డవారంతా ఈ సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు తిరిగి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతూ సంబురాలు చేసుకుంటారు. రకరకాల పిండి వంటలు తయారు చేసుకుని ఆనందం గడుపుతారు. అయితే ఈ సంక్రాంతి పండుగకు సరదాగా పందానికి తెర దీసి కొందరు సొమ్ము చేసుకుంటుంటే మరికొందరు ఇల్లు...


సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం ఎలా?

ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. వెళ్లిపోయిన సమయం తిరిగి రాదు. కాబట్టి జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అదెలాగో తెలుసుకుందాం


Kites Safety Tips: గాలిపటాలు ఎలా వేగురవేయాలో తెలుసా? ఈ జాగ్రత్తలు మీకే!

Here Is Kites Safety Tips: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో గాలిపటాల పండుగ సందడి చేస్తున్నాయి. ఆకాశంలో పతంగులు ఎగురవేస్తుండగా కొన్ని ప్రమాదాలు చోటుచేసుకుంటుండడంతో గోషమహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ కీలక సూచనలు చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.


రేగు పండ్లతో బోలెడు లాభాలు.. ఏంటో తెలుసా?

రేగు పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.


ఆహార వృథా వద్దు.. భవిష్యత్తు తరాలపై ప్రభావం

ఆహార వృథా వద్దు.. భవిష్యత్తు తరాలపై ప్రభావం ప్రపంచ జనాభా ఆహారపు అలవాట్లు, వస్తు వినియోగం భవిష్యత్తు తరాలపై కీలక ప్రభావం చూపుతుంది. భూమిపై జనాభా పెరుగుతూనే ఉంది. 2050 నాటికి ప్రపంచ జనాభా 9.8 బిలియన్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుత జీవనశైలిని కొనసాగించడానికి అవసరమైన సహజ వనరులను అందించడానికి దాదాపు మనలాంటి  మూడు గ్రహాలు అవసరం. వీటినుంచి బయటపడాలంటే ప్రజల...


చెరకు ర‌సంతో చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు చెక్‌

చెరుకు రుచిక‌రంగా ఉండ‌డంతో పాటు దీనిలో అనేక పోష‌కాలు ఉన్నాయ‌ని మ‌నంద‌రికి తెలుసు. అయితే చెరుకుర‌సం చ‌ర్మ సంరక్ష‌ణ‌కు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చాలామందికి తెలియ‌దు. చెరకు రసం వల్ల కలిగే బ్యూటీ ప్రయోజనాలను ఇక్కడ వివరించాం.


మొ టిమలను తగ్గించే సింపుల్ చిట్కాలు ఇవే ​

మొటిమలు అందాన్ని దాచి పెడతాయి. మొటిమలు సమస్యను తగ్గించుకునేందుకు ఇక్కడ చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి.


Wedding: అదిరే శుభవార్త.. ఇక పెళ్లి చేసుకునే వారికి ఉచితంగానే బంగారం, బట్టలు..

అదిరే గుడ్ న్యూస్. సామాన్యులకు, పేదలకు భారీ ఊరట. ఏంటని అనుకుంటున్నారా.. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుంటే పెళ్లి చేసుకునే వారికి ప్రయోజనం కలుగుతుందని అనుకోవచ్చు. కరీంనగర్ జిల్లాలో ప్రజలు గుడ్ న్యూస్. జమ్మికుంట నియోజకవర్గంలో పేదలకు అదిరే తీపికబురు అని అనుకోవచ్చు. సామాన్యులకు చేయూత లభించనుంది. పెళ్లి చేసుకునే వారికి ఉచితంగానే బంగారు పుస్తెలు లభిస్తాయి. అంతేకాకుండా ఇంకా ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి. బట్టలు కూడా ఇస్తారు. అలాగే బంధువులకు భోజన సౌకర్యం కూడా ఉంటుంది. ఎలా అని అనుకుంటారా? అయితే మీరు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. తల్లిదండ్రులు పేరుపై ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. టీపీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి దీన్ని ప్రారంభించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా దీన్ని స్టార్ట్ చేశారు. ప్రజా సేవ కోసం మాత్రమే ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ట్రస్ట్ ద్వారా ఉచితంగా సామూహిక వివాహాలు జరిపిస్తారు. అంతేకాకుండా 24 గంటల పాటు ఉచితంగా 2 అంబులెన్స్ సేవలు ఉంటాయి. ఈ ఖర్చులను ట్రస్ట్ భరిస్తుంది. అంతేకాకుండా ఎవరైనా పెళ్లి చేసుకుంటే.. వారి వివాహాలకు సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికెట్లను కూడా దేవస్థానం నుంచి ఇప్పిస్తారు. ఇక ఎవరైనా పేదలు చనిపోతే మృతదేహం పెట్టేందుకు ఫ్రీజర్లను కూడా అందుబాటులో పెట్టనున్నారు.


కోలాహలంగా కోలాట ఉత్సవం.. అబ్బురపరిచిన చిన్నారుల నైపుణ్యం

సెల్ ఫోన్లు, వీడియో గేములు, ఆన్ లైన్ గేములు ఈ తరం చిన్నారుల వ్యాపకాలు. ఎప్పుడూ అందులోనే మునిగి తేలే చిన్నారుల్లో ఒక్కసారిగా గ్రామీణ జానపద కళ పట్ల ఆసక్తి కలిగింది. పెద్దల ద్వారా ఆ కళ ప్రత్యేకతలను తెలుసుకున్నారు. సాధన చేశారు. అందులోని మెళకువలను తెలుసుకున్నారు. అవలీలగా ఆ కళను ప్రదర్శించే నైపుణ్యం సంపాదించారు. ఆడుతూ పాడుతూ తమ ప్రతిభతో పలువురిని మెప్పించారు. ఇంతకీ ఆ చిన్నారులు నేర్చుకున్న ఆ సంప్రదాయ గ్రామీణ కళ ఏమిటి, దాని ప్రత్యేకత ఏమిటో తెలియాలంటే...


శ్రీకాకుళంలో కనుమ పండుగను సొమ్మల జావ పండువగా జరుపుకుంటారు..

కనుమ పండుగ అనేది ఆంధ్రప్రదేశ్‌లో పశువుల కోసం జరుపుకునే ఒక పండుగ. ఈ పండుగ సంక్రాంతి తర్వాత రోజు జరుగుతూ ఉంటుంది. ఈ పండగ కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి పశువులను, ఊరి జనాలను కాపాడేందుకు సూచనగా ఈ పండుగను నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా, రైతులకు పశువులు పొలం దుక్కి దున్నడం దగ్గర నుంచి పండిన పంటను ఇంటికి తెచ్చే వరకు పశువుల సహాయం లేనిదే ఆ పంట అనేది ఇంటికి చేరదు. కావున పశువులకు కృతజ్ఞతగా కూడా ఈ పండుగ జరుపుకుంటారు. అటువంటి కనుమ పండుగ విశేషాలు ఈ వీడియో...


వెల్లుల్లి రొయ్యల వేపుడు ఇలా చేస్తే రుచి అద్భుతం!

రొయ్యల వేపుడు ఇంట్లోనే సింపుల్‌గా చేసుకోవచ్చు. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి తెలుసుకుందాం.


కొబ్బరి నీళ్లు ఎవరు తాగకూడదో తెలుసా?

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నీటిలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, విటమిన్ సి, బి పుష్కలంగా ఉంటాయి. అయినా.. వీటిని కొందరు మాత్రం తాగకూడదట. మరి ఎవరు తాగకూడదో తెలుసుకుందాాం... కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా ా అవసరం. మనకు నార్మల్ వాటర్ లానే అనిపించొచ్చు. కానీ.. కొబ్బరి నీళ్లు పోషకాల గని. ఈ నీటిలో మన శరీరానికి అవసరం అయ్యే చాలా పోషకాలు ఉన్నాయి. పొటాషియం, సోడియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. అందుకే.. ఈ నీరు ఆరోగ్యానికి చాలా మంచిాది...


ఘనంగా స్వామి అమ్మవార్లకు విశేష పుష్పార్చన..

పుషశుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీశైలం స్వామి అమ్మవార్లకు విశేష పుష్పార్చన అక్కమాదేవి అలంకార మండపంలో నిర్వహించారు. ఈ పుష్పకైంకర్యములో పలురంగుల గులాబీలు, పలు రంగులలోని చేమంతులు, సుగంధాలు, నూరువరహాలు, కాగడా మల్లెలు, సన్నజాజులు, విరజాజులు, తెలగన్నేరు, ఎర్రగన్నేరు, కనకాంబరం, సంపంగి, ఎర్రతామర, నీలం తామద, నందివర్ధనం, గరుడవర్ధనం మొదలైన పుష్పాలు, బిల్వం, దవనం, మరువం, మొదలైన పత్రాలతో శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పూజాదికాలు నిర్వహించారు. సుమారు 4వేల కేజీల పుష్పాలు ఈ పుష్పార్చనకు వినియోగించబడుతున్నాయి. మొత్తం 40 రకాల పుష్పాలతో ఈ పుష్పార్చన జరిపించారు. పుష్పార్చనలో ముందుగా అర్చకస్వాములు, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. సంకల్పంలో దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని, దేశంలో సుఖశాంతులు విలసిల్లాలని, జనులందరికీ సుఖసంతోషాలు కలగాలని, ప్రమాదాలు, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని పుష్పార్చన చేశారు. పూజాదికాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపిస్తారు. మహాగణపతి పూజ తరువాత శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పుష్పార్చన జరిగింది. ఈ పుష్పార్చన సందర్భంగా వేదపారాయణలు జరిపిస్తున్నాయి. దేవస్థానం వేదపండితులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మరో 15 మంది వేదపండితులు కూడా ఈ పారాయణలను జరిపించారు.


సంక్రాంతి ఏ రాశి వారికి కలిసొస్తుంది? పండుగ ప్రభావం ఎవరిపై ఎలా ఉంటుంది?

Sankranti - Zodiac Signs: మనం ప్రతీ సంవత్సరం జనవరి 14న మకర సంక్రాంతిని జరుపుకుంటాం. ఈ రోజు నుంచి సూర్య కిరణాలు.. ఉత్తరార్థ గోళంపై ఎక్కువగా పడతాయి. ఉత్తరాయణం మొదలవుతుంది. అంటే.. మన తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా వేడి పెరగడం మొదలవుతుంది. మరోలా చెప్పాలంటే.. సూర్యుడు భూమి రాశి అయిన మకరరాశి లోకి ప్రవేశిస్తాడు. ఇకపై రాత్రి తగ్గిపోతూ, పగటి వేళ పెరుగుతుంది. అంటే.. ఆశ, అభివృద్ధికి ఇది చిహ్నం. సరికొత్త లక్ష్యాలు పెట్టుకోవాల్సిన సమయం. మకరరాశిని శని దేవుడు పాలిస్తాడు. క్రమశిక్షణ, కృషి, పట్టుదలకు ఈ రాశి పెట్టింది పేరు. మకరరాశి లోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల అన్ని రాశుల వారిపై ప్రభావం ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేషం (Aries):మీరు శక్తి పెరిగే అనుభూతి చెందుతారు. ఇది వృత్తిపరంగా మీకు కలిసొచ్చే సమయం. మీ నాయకత్వానికి గుర్తింపు లభిస్తుంది. మీ జీవితంలో ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడానికీ, నిజమైన పురోగతిని సాధించడానికి మీరు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. అంటే మీకు బాధ్యతలు అప్పగిస్తే, మీ ప్రయత్నాలను సీనియర్లు గమనిస్తారు కాబట్టి వాటిని దాచవద్దు. అయితే, నియంత్రణ ముఖ్యం. అతిగా పని చేయవద్దు లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులను పూర్తిగా విస్మరించవద్దు. ఈ కాలం మిమ్మల్ని క్రమశిక్షణతో, మీ లక్ష్యాలకు కట్టుబడి ఉండేలా చేస్తుంది. వృషభం (Taurus):మీ జీవితంలో కొత్త పేజీని తెరవడానికి ఇది సమయం. కొత్త ఆలోచనలను నేర్చుకోవడానికి, కోర్సు తీసుకోవడానికి లేదా సాహసోపేత యాత్రను ఏర్పాటు చేయడానికీ ఇది సమయం. మీరు జ్ఞానాన్ని, మరింత జ్ఞానోదయాన్ని కోరుకుంటారు. మీకు కావాల్సిన సమాచారం ఇచ్చే ప్రభావవంతమైన వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో సృజనాత్మకతకు ప్రతిఫలం లభిస్తుంది. కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. కొత్త ఆలోచనలకు మీ మనస్సును తెరిచి ఉంచండి, ఇది వృద్ధికి సహాయపడవచ్చు. సానుకూలంగా ఉండండి. మీ సాహసోపేత హృదయం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మిథునం (Gemini):మీకు తెలిసిన వ్యక్తుల తెలియని కోణాలను ఇప్పుడు తెలుసుకుంటారు. వారి అసలు రూపాలు బయటపడతాయి. చెప్పకుండా వదిలేసిన భావోద్వేగ సమస్యను చర్చించడానికి సిద్ధపడతారు. పెట్టుబడులు, పన్నులు లేదా ఆస్తి వంటి ఆర్థిక సమస్యపై దృష్టి సారిస్తారు. మిమ్మల్ని మీరు నమ్మాలి. సున్నితమైన సమస్యలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కార్యాలయంలో మీలో వచ్చే మార్పుల్ని అందరూ స్వాగతిస్తారు. తద్వారా మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఇది గతాన్ని విడిచిపెట్టి, మళ్లీ ప్రారంభించి, మిమ్మల్ని మీరు సరికొత్తగా ప్రదర్శించుకునే సమయం. ఇది మీ అభివృద్ధిని సూచిస్తోంది. కర్కాటకం (Cancer):మానవ సంబంధాలపై దృష్టి పెట్టే సమయం. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి. మీరు అపార్థాలను వదిలేసి, మీతో కలిసే వాళ్లతో కలిసి నడిచేందుకు సిద్ధపడతారు. వారితో ఎలా మెలగాలో మీకు తెలుస్తుంది. అపార్థాలు తొలగుతాయి. అందరితో కలివిడితనం మెరుగవుతుంది. కొత్త వ్యాుపార అవకాశాలు ముందుకొస్తాయి. అందుకోసం మీరు తప్పనిసరిగా ఇతరులతో కలిసి పనిచేస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు నిజాయితీగా, స్పష్టంగా ఉండండి. మీలో వచ్చే మార్పులు మీకు ఆరోగ్యకరంగా ఉంటాయి. మంచి సంబంధాలు ఏర్పడి, మీ జీవితం బాగుంటుంది. సింహం (Leo):మీ పనిభారాన్ని తగ్గించడానికీ, సంస్థాగత సమస్యలను పరిష్కరించడానికీ, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికీ ఇది సమయం. మీరు మరింత వ్యాయామం చేయాలనుకోవచ్చు లేదా వ్యవస్థీకృతంగా ఉండటానికి బాగా తినవచ్చు. వృత్తిపరంగా, మీ అంకితభావం, వివరాల పట్ల శ్రద్ధకు ప్రశంసలు దక్కుతాయి, ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి. కానీ అతిగా పని చేయవద్దు. ఇక్కడ స్మార్ట్ వర్క్ ముఖ్యం. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు చేసే పనిని కచ్చితత్వంతో ఎంచుకోండి. దీర్ఘకాలిక శ్రేయస్సు, వ్యక్తిగత అభివృద్ధికి మంచి పునాది పడుతుంది. ఇకపై మీ జర్నీ బాగుంటుంది. కన్య (Virgo):ఇది మీ ఆసక్తులను తెలుసుకోవడానికీ, మీ ప్రతిభకు తగిన గుర్తింపును ఇచ్చే సమయం. ఇది మీరు సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనాలని లేదా మీరు మీకు నచ్చే పనులను చేయాలనుకునేలా చేస్తుంది. హృదయ విషయాలలో, ఈ కాలం సంబంధాలను పెంపొందించడానికీ, ఇప్పటికే ఉన్న వాటిలో మరింత రొమాన్స్ తీసుకురావడానికి అనుకూల సమయం. సింగిల్స్ వారు, తమతో కలిసొచ్చేవారిని కనుక్కుంటారు. ఇది వారిని సంతోషపరుస్తుంది. వృత్తిపరమైన స్థాయిలో, సృజనాత్మక అంశాలు పాజిటివ్‌గా ఉంటాయి. ఇకపై మీరు మీకు నచ్చినవి చేస్తూ, ముందుకు దూసుకెళ్తారు. తుల (Libra):ఈ సమయంలో మీరు మీ కుటుంబంపై దృష్టి పెట్టాలి, మీ కుటుంబ సభ్యులు, ప్రియమైనవారితో బలమైన బంధాలను పెంచుకోవాలి. మీరు కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. మీ ఇంటిని అలంకరిస్తారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపే పరిస్థితులు ఉన్నాయి. కెరీర్ కోసం, ఇంటి నుంచి పనిచేయడం లేదా పని, కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం ఒక ముఖ్యమైన ప్రాధాన్య అంశం. లోపలి నుంచి శాంతిని పెంచుకోండి. మీ భావోద్వేగ అభివృద్ధిపై పనిచేయండి. ఈ కాలం మీ భవిష్యత్తు కోసం భావోద్వేగ అంసాలను పెంచుకునేలా చేస్తుంది. వృశ్చికం (Scorpio):ఇది ఉన్నది ఉన్నట్లు చెప్పడానికీ, మీరు ఉపయోగించే పదాలతో మార్పు తీసుకురావడానికి డైనమిక్ కాలం. ఆలోచనలను ప్రదర్శించేటప్పుడు లేదా సంభాషణలో రాసేటప్పుడు మీ వాయిస్ వినిపించాలి. మీరు కొత్త జ్ఞానాన్ని పొందాలనుకోవచ్చు లేదా ఇంటి నుంచి కొద్ది దూరంలోనే ఉద్యోగాన్ని పొందవచ్చు. ఒక చిన్న పర్యటన లేదా తోబుట్టువులు, పొరుగువారితో పరిచయం కొత్త ఆలోచనలను పెంచడానికి సహాయపడవచ్చు. ఇతరుల సహకారానికి తలుపులు మూసివేయవద్దు ఎందుకంటే ఇది సానుకూల ఫలితాలను ఇస్తుంది. మరింత చురుకుగా ఉండండి, మీ ఆలోచనలను ఆచరణలో పెట్టండి. ధనస్సు (Sagittarius):ఆర్థికంగా నిలదొక్కుకోవడానికీ, మీ విలువల్ని చాటడానికీ ఇది మంచి సమయం. ఎక్కువ డబ్బు పొందే అవకాశాలు ఉన్నాయి. లేదా సరిగ్గా పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది మీ విలువను మరింత పెంచుతుంది. మీరు సమాజంలో సరైనది, అర్ధవంతమైనది చేయాలనే ఆలోచనలకు వస్తారు. వృత్తి జీవితంలో, మీరు మీ స్కిల్స్, ప్రతిభను ప్రదర్శించి, గుర్తింపు పొందుతారు. ఇది మీకు కీలక మార్పు. మీరు ఆకాశంలో నిచ్చెనలు వెయ్యరు. స్థిరమైన, భౌతిక, భావోద్వేగ జీవితాన్ని నిర్మించుకుంటారు. వాస్తవాలకు దగ్గరగా పనిచేస్తారు. మకరం (Capricorn):ఇక మీరు మీ అసలు టాలెంట్లను బయటకు తీసి, ప్రదర్శించాల్సిన సమయం వచ్చేసింది. మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ఉండవచ్చు. మీకు కావలసినదానిని అనుసరించడానికి ప్రేరణ పొందుతారు. ఇప్పురు మీరు సంవత్సర కాలంలో ఏం చేసిందీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. నెక్ట్స్ లక్ష్యాన్ని నిర్దేశించే సమయం. వృత్తిపరమైన దృక్కోణం నుంచి చూస్తే, మీరు నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించగలరు, ప్రజలు మీ నాయకత్వాన్ని అనుసరిస్తారు. మీ ఆరోగ్యం, రూపాన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఇది మంచి సమయం. మీ కోసం నిలబడటానికీ, జీవితాన్ని సరైన దిశలో నడిపించడానికి.. మీకు రాబోతున్న శక్తిని ఉపయోగించండి. కుంభం (Aquarius):ఇది మీ గురించి మీరు అన్వేషించుకోవాల్సిన సమయం. అలవాట్లు, సంబంధాలు లేదా పరిస్థితులు.. అన్నింటినీ పరిశీలించుకోవాలి. ఇకపై మీకు అనారోగ్యకరమైన విషయాలను మీరు వదిలేస్తారు. చెడు అంశాలకు గుడ్‌బై చెబుతారు. ఒంటరితనం రిఫ్రెష్‌గా ఉంటుంది. జీవితం నుంచి మీకు ఏమి కావాలో ఆలోచిస్తారు. తగిన నిర్ణయం తీసుకోవడానికి మీకు ఇప్పుడు టైమ్ కలిసొస్తుంది. అంతర్ దృష్టితో ఆలోచిస్తారు. మీ కలలు మీకు ఆన్సర్ ఇస్తారు. కలలు ఏం చెబుతున్నాయో గమనించాలి. వృత్తి పరంగా, సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, కొత్త విషయాలు తెలుస్తాయి. అన్ని రకాలుగా కోలుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రార్థన చేయడం మంచిది, అందుకు టైమ్ కేటాయించాలి. మీనం (Pisces):ఇక మీరు స్ఫూర్తిని పొందుతారు. మీ లాంటి మనస్సు, ఉద్దేశ్యం ఉన్న వ్యక్తులతో కలిసి ఉండటానికి సమయం. గ్రూపుగా అసైన్‌మెంట్‌లు పూర్తిచేసి, పురోగతి సాధించి, ప్రశంసలు పొందే ఛాన్స్ ఉంది. మీ కలలను నిజం చేసే స్నేహితులు లేదా ప్రభావవంతమైన వ్యక్తుల సహాయం మీరు పొందే అవకాశాలున్నాయి. అలాంటి భాగస్వామ్యాల వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలగవచ్చు లేదా దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలు ఉండొచ్చు. మీ మనస్సును సరళంగా ఉంచుకోండి. మీ మొత్తం లక్ష్యాలతో, మీ ప్రస్తుత పనులను లింక్ చెయ్యండి. మకరరాశిలోకి సూర్య గమనం మీకు కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికీ, మీ కలలను సాకారం చేసుకోవడానికి అవకాశాలను ఇస్తుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


మకరజ్యోతి దర్శనం.. అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన శబరిమల.. వీడియో చూసేయండి..

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబలమేడు కొండల్లోని కందమల శిఖరంపై మకరజ్యోతి దర్శనంతో అయ్యప్ప నామస్మరణతో శబరిమల గిరులు మారుమోగాయి. మకరజ్యోతి దర్శనంతో అయ్యప్ప భక్తులు పరవశించిపోయారు.


Mutton Dum Biryani: కనుమ రోజు మటన్ దమ్ బిర్యానీ ఇలా సింపుల్ పద్ధతిలో చేసేయండి, రెసిపీ ఇదిగో

హోటల్ స్టైల్లో మటన్ దమ్ బిర్యాని ఇలా చేశారంటే అదిరిపోతుంది. చాలామందికి మటన్ దమ్ బిర్యాని చేయడం రాదు. ఇక్కడ మేము సింపుల్ గా ఎలా చేయాలో చెప్పాము.


ముల్లంగితో కలిగే ప్రయోజనాలు ఇవే!

ముల్లంగిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ముల్లంగి తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరించాం


మన సంస్కృతి సంప్రదాయాలు గొప్పవి : డీసీసీ ప్రెసిడెంట్​ నర్సారెడ్డి

మన సంస్కృతి సంప్రదాయాలు గొప్పవి : డీసీసీ ప్రెసిడెంట్​ నర్సారెడ్డి గజ్వేల్, వెలుగు: మన సంస్కృతీ, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటిని ప్రతి ఒక్కరూ పాటించాలని డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్​ పట్టణంలో నిర్వహించిన కైట్​ఫెస్టివెల్​లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పతంగులు ఎగురవేశారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్...


లక్షా 60 వేల ఏళ్లలో తొలిసారి కనిపించనున్న ఈ అద్భుతం ఏంటంటే..

ఆకాశంలో తోక చుక్క ఎక్కడ కనిపిస్తుందో తెలుసుకునేందుకు, దాన్ని ట్రాక్ చేసేందుకు ప్రయత్నించేవారు సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో అప్రమత్తంగా ఉండాలని బాలాజీ హెచ్చరించారు.


స్నానం చేస్తూ ఈ పార్ట్‌ని శుభ్రం చేసుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాలి..

స్నానంలో ప్రతి రోజు శుభ్రపరచాల్సిన శరీర భాగాల విషయంలో, కొన్ని భాగాలు ప్రతి రోజు శుభ్రపరచడం అవసరం లేదని చెప్పవచ్చు. అవి సహజంగా స్వచ్ఛతను నిర్వహించుకుంటాయి లేదా అవి తక్కువ మురికితో ఉంటాయి. ఇంటర్నెట్‌లో అనేక ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాల కోసం ఎప్పుడూ చర్చలు జరుగుతాయి. అందులో ఒకటి అత్యంత వివాదాస్పదమైన ప్రశ్న ఏమిటంటే "స్నానం చేస్తున్నప్పుడు కాళ్ళను నిజంగా కడుక్కోవాల్సిన అవసరం ఉందా? ఈ ప్రశ్న మనలో కొంతమందికి సందేహాన్ని రేపినా, కొంతమంది మాత్రం జవాబు చెప్తున్నారు. ప్రస్తుతం, ఈ ప్రశ్నకు సమాధానం వైద్యులు "మీరు కాళ్ళను కడుక్కోనవసరం లేదు" అని చెప్తున్నారు. ఎందుకంటే, మన శరీరంలోని పైభాగం నుంచి కడుక్కోవడానికి ఉపయోగించే నీరు, సబ్బు కాళ్ళకు చేరుకుంటాయి. కాబట్టి ప్రత్యేకంగా కాళ్ళను కడుక్కోవడం అవసరం లేదని వారు అంటున్నారు. మీరు సైకిల్ తొక్కుతున్నప్పుడు, లేదా ఎక్కువగా చెమటలు పెట్టినప్పుడు మాత్రమే కాళ్ళను కడుక్కోవాలి. సాధారణంగా, కాళ్ళు సున్నితంగా ఉండి మురికి పట్టుకోవడానికి పెద్ద కారణం ఉండదు." అయితే, మీరు మరీ ఎక్కువగా కడుగుతున్నప్పుడు, లేదా మీ కాళ్ళు చాలా మురికిగా ఉంటే, వాటిని కడుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తంగా, కాళ్ళను అవసరంలేని సమయంలో కడకపోవడం, అవి చర్మంపై ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కానీ చాలామంది మనం ఎక్కువగా నడుస్తాము బయట అంతా తిరిగి వచ్చినప్పుడు కచ్చితందా కాళ్లు శుభ్రం చేసుకుంటాము కదా అని అందరూ అనుకుంటారు. మరి అలాంటి దానికి సమాధానం ఏంటి అని అడుగుతారు. అది కేవలం రోజుకు ఒక సారి మాత్రమే జరుగుతుంది. కేవలం స్నానం చేసేటప్పుడు మాత్రం ప్రత్యేకంగా కడుక్కోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు.


సంక్రాంతి పండగ జరుపుకోని గ్రామం.. స్నానాలు చేయరు, ఇళ్లు ఊడవరు, ఎందుకో తెలుసా?

సంక్రాంతి పండగను జరుపుకోని ఓ గ్రామం ఉందంటే మీరు నమ్ముతారా. అది కూడా ఘనంగా జరుపుకునే ఆంధ్రప్రదేశ్‌లోనే అని మీకు తెలుసా. ఇప్పుడే కాదు.. ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఆ గ్రామస్థులు సంక్రాంతి పండగను జరుపుకోకుండా దూరంగా ఉంటున్నారు. స్నానాలు చేయకపోవడం, ఇళ్లు కూడా ఊడ్వకుండా ఉండటం గమనార్హం. ఇంతకీ అది ఏ గ్రామం. ఎందుకు ఆ గ్రామస్థులు సంక్రాంతి పండగను జరుపుకోవడం లేదు. దాని వెనక ఉన్న కథేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


Sankranti Wishes: మీ ప్రియమైన వారికి సంక్రాంతి శుభాకాంక్షలను ఇలా ప్రేమగా తెలుగులో చెప్పండి

Sankranti Wishes: మకర సంక్రాంతి పండుగ సందర్భంగా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలను తెలుగులోనే చెప్పండి. ఇక్కడ మేము కొన్ని అందమైన శుభాకాంక్షలు అందించాము.


ఘుమఘుమలాడే బెల్లం తయారీతో లాభాల బాటలో రైతులు!

ఘుమఘుమలాడే బెల్లం తయారీతో రైతులు లాభాలు పొందుతున్నారు. చెరకు పంట సాగుచేసిన రైతులు పొలం వద్ద బెల్లం వండి విక్రయిస్తున్నారు. బెల్లం ఘుమఘుమల వాసనకు జనాలు బెల్లం కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సంప్రదాయ పద్ధతిలో బెల్లం తయారు చేస్తున్నారు. చెరకు పాలకు కూడా మంచి గిరాకీ ఉంది. చెరకును ఫ్యాక్టరీ తరలించే కంటే బెల్లం వండితేనే మంచి లాభాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లా అంటే బెల్లం తయారీకి ప్రసిద్ధి. ఇక్కడి...


Sankranti Festival Celebrations in Vizag | Village Sankranti Celebrations | AP | #local18shorts

సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఒక్కరూ తమ సొంతూర్లు పల్లె గ్రామాలకు వెళుతుంటారు. బ్రతుకు జీవనం కోసం నగరాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ సొంతూర్లకు పయనమై తమ ఇంటి వద్ద సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు. నగరాల్లో ఉన్నవారికి పల్లెటూరు వాతావరణం కావాలనుకుంటే వారు బంధువుల ఇంటికి వెళ్తారు. నగరంలో పల్లెటూరు వాతావరణం ఉంటే ఎంతో బాగుంటుంది. ఇలా నగరాల్లో ఉండే నగరవాసులకు సంక్రాంతి అనుభూతి కలిగించే విధంగా విశాఖపట్నంలోని ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో పల్లెటూరు వాతావరణం కల్పించే విధంగా గ్రౌండ్ అంతా కూడా ఏర్పాటు చేశారు. సంక్రాంతి ఉట్టి పడేలా గ్రౌండ్ అంతా కూడా కనిపిస్తుంది.#vizag #sankranthicelebrations #apnews -----------------------------------------------------------------------------------------Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 TeluguFollow us: Subscribe: https://www.youtube.com/@News18TeluguWebsite: https://telugu.news18.com/Whatsapp: https://whatsapp.com/channel/0029VaBicceHLHQaaV6fWs2NFacebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18TeluguInstagram: https://www.instagram.com/news18telugu/News18 Mobile App - https://onelink.to/desc-youtube


Beauty Hacks: మీ ఖరీదైన లిప్‌స్టిక్ విరిగిపోయిందా? బాధపడకండి ఈ టిప్స్‌తో మళ్ళీ కొత్తదానిలా మార్చుకోవచ్చు!

Beauty Hacks: మీ ఖరీదైన లిప్‌స్టిక్ విరిగిపోయిందా? బ్యాగులోని ఇతర వస్తువులతో కలిసిపోయి పాడైపోయిందా? దాన్ని పడేయడం తప్ప వేరే మార్గం లేదని బాధపడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ బ్యూటీ హాక్స్‌తో విరిగిపోయిన మీ ఫేవరెట్ లిప్‌స్టిక్‌ను మళ్ళీ కొత్తదానిలా మార్చుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి.


చ‌లికాలంలో ప‌ల్లీలు తింటున్నారా?ఇవి తెలుసుకోండి!

చ‌లికాలంలో రోగాల బెడ‌ద ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే ఈ కాలంలో మ‌నం తీసుకునే ఆహారం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. చ‌లికాలంలో ప‌ల్లీలు ఎక్కువ‌గా తింటే మంచిద‌ని కొంద‌రు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


శబరిమలలో దర్శనమిచ్చిన మకర జ్యోతి.. దద్దరిల్లిన శబరిగిరులు

శబరిమలలో దర్శనమిచ్చిన మకర జ్యోతి.. దద్దరిల్లిన శబరిగిరులు తిరువనంతపురం: అయప్ప భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న మకర జ్యోతి శబరిమలలో దర్శనం ఇచ్చింది. సంక్రాంతి పర్వదినాన శబరిమలలోని పొన్నాంబలమేడు పర్వఖ శిఖరాల్లో దేదీప్యమానంగా భక్తులకు మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. మకర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప స్వాములు, స్వాములు పెద్ద ఎత్తున శబరికి తరలివచ్చారు. మకరజ్...


కనుమ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా..

సంక్రాంతి పండుగను మూడు రోజులపాటు ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండుగను కనుమ పండుగ అంటారు. కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవులని ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ. పశుపక్షాదులకి గౌరవాన్ని సూచించే పండుగగా ఈ కనుమ ప్రసిద్ధి అని వరంగల్‌కి చెందిన అర్చకులు రాధాకృష్ణ శర్మ లోకల్ 18తో తెలిపారు.రైతు పొలం దున్ని, విత్తనాలు విత్తి, పంటను పండించి వాటిని ఇంటికి చేర్చడంలో పశువుల ప్రాధాన్యత...


ఇంటింటా భోగిభాగ్యాలు

ఇంటింటా భోగభాగ్యాలు నింపింది భోగి. పల్లెలన్నీ భోగి మంటల్లో మెరిసిపోయాయి. ప్రజలంతా భోగి సంబురాల్లో మురిసిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఊరూవాడా సోమవారం భోగి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.


Sankranthi 2025: సంక్రాంతికి నిప్పుల మీద నుంచి పశువులను నడిపించే సాంప్రదాయం గురించి తెలుసా? ఇలా ఎక్కడ చేస్తారంటే

Sankranthi 2025: సంక్రాంతి సంబరాలు దేశమంతటా వైభవంగా జరుగుతాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఈ సంప్రదాయాలు ఉంటాయి. పాత మైసూరు ప్రాంతంలో పశువులను నిప్పు పైనుంచి దూకించే ఒక ప్రత్యేకమైన సంప్రదాయం ఇది. ఇలా ఎక్కడ చేస్తారో తెలుసుకోండి.


నోటి దుర్వాసన తట్టుకోలేక మౌత్ వాష్ వాడుతున్నారా, జాగ్రత్త ఈ సమస్యలొస్తాయి

నేటి కాలంలో హైజీన్ అనేది అనివార్యమైంది. చాలా మంది శుభ్రంగా ఉండాలనుకుంటున్నారు. అలానే నోటి శుభ్రత కోసం మౌత్ వాష్ వాడుతుంటారు. కానీ, దీనిని వాడడం వల్ల కొన్ని సమస్యలొస్తాయి. అవేంటో తెలుసుకోండి.